సెన్సేషనల్‌ ప్రాజెక్ట్ః ప్రశాంత్‌ నీల్‌తో ప్రభాస్‌ మరో సినిమా.. ఈ సారి `బాహుబలి`ని మించి?

First Published Jun 11, 2021, 10:24 AM IST

ప్రభాస్‌ మరో సంచలన ప్రాజెక్ట్ కి తెరలేపబోతున్నారు. ఆయన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడట. ఇది `బాహుబలి`ని మించి ఉండబోతుందనే వార్త ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రభాస్‌ ప్రస్తుతం `కేజీఎఫ్‌` డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో `సలార్‌` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది.
undefined
ఇది కోల్‌ మైనింగ్‌ నేపథ్యంలో ఓ కార్మికుల లీడర్‌ కథాంశంతో సాగుతుందని తెలుస్తుంది. ఇందులో ప్రభాస్‌ నాయకుడిగా కనిపించబోతున్నారట. త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. గ్రాండియర్‌గా, భారీ లెవల్‌లో పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతుంది. `కేజీఎఫ్‌`ని మించి ఉండబోతుందని టాక్‌.
undefined
ఇదిలా ఉంటే వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందట. ప్రభాస్‌ 25వగా ఈ సినిమా రూపొందించేందుకు ప్లాన్‌ జరుగుతుందట. అయితే ఈ సారి సినిమా `బాహుబలి`ని మించి ఉంటుందని సమాచారం.
undefined
ర్మాత దిల్‌రాజు ఈ ప్రాజెక్ట్ ని సెట్‌ చేస్తున్నారని సమాచారం. ప్రభాస్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో, `బాహుబలి` మించిన మైథలాజికల్‌ కథతో, దాన్ని మించిన గ్రాండియర్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాలని ఇది ఇండియన్‌ తెరపై బిగ్గెస్ట్ చిత్రంగా నిలవాలని ప్లాన్‌ చేస్తున్నట్టు ప్రస్తుతం వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
undefined
దీనిపై ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇప్పుడీ వార్త ప్రభాస్‌ ఫ్యాన్స్ కి గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. సోషల్‌ మీడియా వేదికగా ఊగిపోతున్నారు. `బాహుబలి`ని మించి అంటే అది మామూలు విషయం కాదు. దీంతో ఈ వార్త అటు ఫిల్మ్ నగర్‌ని, ఇటు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.
undefined
ప్రస్తుతం ప్రభాస్‌ `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతుండగా, ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇది ఈ ఏడాదిలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
undefined
దీంతోపాటు `ఆదిపురుష్‌` అనే రామాయణం ఆధారంగా మరో సినిమా చేస్తున్నారు ప్రభాస్‌. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తుండగా, సీత పాత్రలో కృతి సనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకొస్తుంది. ఇందులో రాముడిగా ప్రభాస్‌ కనిపించనున్నారు. అలాగే నాగ్‌ అశ్విన్‌తో ఓ సైన్స్ ఫిక్షన్‌ చేయబోతున్నారు ప్రభాస్‌. ఈ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌తో మరో సినిమా ఉంటుందని టాక్‌. అదే సమయంలో `వార్‌` సీక్వెల్‌ కూడా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది.
undefined
click me!