పవన్‌ కళ్యాణ్‌ మైండో బ్లోయింగ్‌ డిసీషన్‌..ఫ్యాన్స్ రెచ్చిపోవడం ఖాయం!

First Published Oct 14, 2020, 7:34 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలకు గ్యాప్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు సినిమాలను ప్రకటించి ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేశారు. తాజాగా మరో మైండ్‌ బ్లోయింగ్‌ డిసీషన్‌ తీసుకున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు చేస్తున్నారంటే ఆయన అభిమానులకు ఓ పూనకమే చెప్పాలి. తెరపై ఆయన కనిపిస్తే చాలు ఊగిపోతుంటాయి. పవనిజం పవర్‌ అది.
undefined
ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలను వదిలేశారు. ఒకానొక సమయంలో సినిమాలు మానేస్తా అనే సంకేతాలిచ్చారు. కానీ రాజకీయాల్లో సక్సెస్‌ కాలేకపోవడంతోఇప్పుడు డబ్బు కోసం సినిమాలు చేస్తున్నారు.
undefined
రీఎంట్రీ తర్వాత బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆయన మూడు సినిమాలు ప్రకటించారు. `వకీల్‌ సాబ్‌` ఇప్పటికే షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీంతోపాటు క్రిష్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా,అలాగే హారీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.
undefined
పవన్‌ స్పీడ్‌కి ఆయన అభిమానులు కూడా షాక్‌కి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ మరో మైండ్‌ బ్లోయింగ్‌ డిసీషన్‌ తీసుకున్నారట. పవన్‌ నిర్ణయంపై ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారట.
undefined
మలయాళ సినిమా `అయ్యప్పనుమ్‌ కోషియమ్‌` చిత్ర రీమేక్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. ఇందులో మరో హీరోగా రానా నటిస్తారని తెలుస్తుంది.
undefined
అయితే ఈ సినిమా కోసం పవన్‌ కాల్షీట్లు కేవలం నెల రోజులు కేటాయిస్తే సరిపోతుందట. ఒకే షెడ్యూల్‌లో, పొలాచ్చిలో చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారని టాక్. ఫిబ్రవరిలోపవన్‌ డేట్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.
undefined
ఈ లోపు `వకీల్‌ సాబ్‌`ని విడుదల చేస్తారు. క్రిష్‌ సినిమాలో మేజర్‌ పార్ట్ ని పూర్తి చేయనున్నారట. ఫిబ్రవరిలో `అయ్యప్పనుమ్‌ కోషియమ్‌` పూర్తి చేసి ఆ తర్వాత హారీష్‌సినిమాని పట్టాలెక్కిస్తారని సమాచారం. మరి ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు వహిస్తారనేది తెలియాల్సి ఉంది. ఆ తర్వాత సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లోనూ ఓ సినిమా ఉంటుందనివినిపిస్తుంది.
undefined
click me!