అయితే సీఎం జగన్.. పోసానిని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి వెళ్లాలని లేదా ఏపీలో కూడా షూటింగ్స్, సినిమా నిర్మాణాలు లాంటి కార్యకలాపాలు వేగవంతం చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ కార్యక్రమాలు, సినిమా నిర్మాణాలు మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి.