ఏడాదిపాటు నన్ను అలానే చూశాడు.. ఫస్ట్ లవ్‌ స్టోరీ రివీల్‌ చేసిన పూర్ణ.. ఎలా బ్రేక్‌ అయ్యిందంటే?

First Published Jun 23, 2024, 2:51 PM IST

నటి పూర్ణ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. `ఢీ` జడ్జ్ గానూ మెరిసి ఆకట్టుకుంది. ఇప్పుడు ఫ్యామిలీలైఫ్‌కి పరిమితమై పూర్ణ ఫస్ట్ లవ్‌ స్టోరీ బయటకు వచ్చింది. 
 

పూర్ణ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది. ఆమె పెళ్లి చేసుకుని తల్లి కూడా అయ్యింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యింది. మొన్నటి వరకు డాన్స్ షో `ఢీ` షోకి జడ్జ్ గా చేసింది. ఇప్పుడు దాన్ని కూడా వదిలేసింది. ఇటీవల ఆమె `భీమా`, `గుంటూరు కారం` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఆమె చేతిలో అయితే సినిమాలు లేవు. 
 

తాజాగా పూర్ణకి చెందిన ఓ విషయం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆమె తన ఫస్ట్ లవ్‌ స్టోరీ బయటపెట్టింది. అందరి జీవితంలోనూ లవ్‌ స్టోరీలుంటాయి. ఫస్ట్ క్రష్‌ కచ్చితంగా ఉంటుంది. అలా తన జీవితంలోనూ ఉందని చెప్పింది పూర్ణ. స్కూల్‌ డేస్‌లోనే ఆ ప్రేమ కథ జరిగిందని, సినిమా స్థాయిలో ఉందని వెల్లడించింది పూర్ణ.
 

Latest Videos


 ఈ సందర్భంగా లవ్‌ స్టోరీని వెల్లడించింది. ఏడాదిపాటు చూపులతోనే ప్రేమించుకున్నామని చెప్పింది పూర్ణ. స్కూల్‌ డేస్‌లోనే తన మొదటి ప్రేమ స్టార్ట్ అయ్యిందని చెప్పింది. తాను గర్ల్స్ స్కూల్‌లో చదువుకుందట. అందులో అబ్బాయిలు ఉండేవారు కాదు. కానీ తమ స్కూల్‌కి కిలో మీటర్ లోపు పరిధిలోనే బాయ్స్ స్కూల్‌ ఉండేదట. 

తమ స్కూల్‌ బస్‌ బాయ్స్ స్కూల్‌ దగ్గర్నుంచే వెళ్లేదట. కొందరు చిన్నపిల్లలను దించడం కోసం ఆ స్కూల్‌ వద్ద కాసేపు ఆగేదట. అలా ఓ రోజు ఓ కుర్రాడు స్కూల్‌ వద్ద నిల్చోని తనని చూస్తున్నాడట. సడెన్‌గా తమ ఇద్దరు చూపులు కలిశాయని తెలిపింది పూర్ణ. ఆ తర్వాత రోజు నుంచి ప్రతి రోజూ అతను అదే ప్లేస్‌లో ఉండి తననే చూసేవాడట. 
 

సుమారు ఏడాదిపాటు అలానే జరిగింది. తమ బస్‌ వెళ్లడం, అతను అక్కడే నిలబడి తనని చూడటం జరిగిందట. ఏడాదిపాటు కళ్లతోనే ప్రేమించుకున్నామని చెప్పింది పూర్ణ. ఇక వాలెంటైన్స్ డే రోజు ఏకంగా తనకు చాక్లెట్లు, రోజా పువ్వుని కూడా పంపించాడట. కానీ తమ ప్రేమ అలా చూసుకోవడంతోనే ఆగిపోయిందని చెప్పింది పూర్ణ. ఎంతో ఫ్యూర్‌గా, క్యూట్‌గా సాగిన ఈ లవ్‌ స్టోరీ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఐడ్రీమ్‌ ఓల్డ్ ఇంటర్వ్యూలో పూర్ణ ఈ విషయాన్ని వెల్లడించింది. 
 

కేరళాకి చెందిన పూర్ణ మలయాళ చిత్రంతో నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. ఆమె చిన్ననాటి నుంచే క్లాసికల్‌ డాన్సర్‌. అదే ఆమెని సినిమాల వైపు నడిపించింది. 2004లో `మంజు పోలోరు పెంకుట్టీ` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ప్రారంభంలో కీలక పాత్రల్లో నటించి ఆ తర్వాత హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. 2007లో `శ్రీ మహాలక్ష్మి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో శ్రీహరి సరసన నటించింది. కొంత గ్యాప్‌తో 2011లో `సీమటపాకాయ్‌` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఇది బాగానే ఆడింది. 

ఆ తర్వాత రవిబాబు `అవును` సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ అందుకుంది. హర్రర్‌ మూవీ పెద్ద హిట్‌ కావడంతో పూర్ణ లైఫ్‌ టర్న్ తీసుకుంది. ఓ వైపు మలయాళం, తమిళం, కన్నడ చిత్రాలు చేస్తూనే తెలుగులోనూ మెరిసింది. ప్రారంభంలో హీరోయిన్‌గా చేసి ఆ తర్వాత క్యారెక్టర్స్ గా టర్న్ తీసుకుంది. ఇటీవల `గుంటూరు కారం`లో కూర్చీ డాన్స్ లో మెరిసిన విషయం తెలిసిందే.
 

click me!