కేరళకు చెందిన పూర్ణ మలయాళం చిత్రాలతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో కొన్ని సినిమాలు చేసింది. టాలీవుడ్ లో ‘శ్రీ మహాలక్ష్మి’, ‘సీమా టపాకాయి’, ‘అవును’, ‘నువ్వలా నేనిలా’, ‘అవును2’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలయ్య ‘అఖండ’, ‘దసరా’లోనూ కీలక పాత్రలతో అలరించింది.