పూజా హెగ్డే తాజాగా చిలిపిగా ఓ రెండు గ్లామర్ ఫోటోలను పంచుకుంది. థైస్ చూపిస్తూ ఈ అమ్మడు ఇచ్చిన క్యూట్ పోజులు నెట్టింట వైరల్గా మారాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి.
అయితే అందరి ఫోకస్ మాత్రం పూజా కాళ్లపైనే పడింది. `అల వైకుంఠపురములో` పూజా కాళ్లని ఫేమస్ చేశాడు అల్లు అర్జున్. ఏకంగా పాటే పాడి హైలైట్గా మార్చేశాడు. పూజా కాళ్లల్లో అంత అందం ఉందా? అనేలా చేశాడు.
కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రం చూడబోతే పూజా కాళ్లల్లో గోల్డ్ ని చూసినట్టుంది. గోల్డెన్ లెగ్గా భావిస్తున్నట్టు కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఆ కథేంటో చూస్తే.
జనరల్గా హీరోయిన్లు నటించిన చిత్రాలు వరుసగా హిట్ అయితే ఆమెవి గోల్డెన్ లెగ్ అంటారు. వరుస ఫ్లాప్లు అయితే ఐరన్ లెగ్ అంటుంటారు. పూజా విషయంలో గోల్డెన్ లెగ్ అనే మాట బాగా వర్తిస్తుంది.
ఆమె నటించిన సినిమాలన్నీ విజయాలు సాధిస్తున్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది. తివిక్రమ్కి గోల్డెన్ లెగ్ పూజా అని, ఇప్పట్లో త్రివిక్రమ్.. పూజాని వదిలేలా లేరుగా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
దీంతో ఇప్పుడు మరోసారి పూజాని రిపీట్ చేస్తున్నాడీ మాటల మాంత్రికుడు. మహేష్తో చేస్తున్న `ఎస్ఎస్ఎంబీ28` చిత్రంలో హీరోయిన్గా ఆమెనే ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని కాసేపటి క్రితం వెల్లడించారు.
ఏదేమైనా హిట్ కాంబినేషన్లో అంటే మార్కెట్ పరంగానూ కలిసొచ్చే అంశం. త్రివిక్రమ్ ప్లాన్ వెనకాల అది కూడా ఓ కారణంగా కావచ్చు.
మరోవైపు `మహర్షి` చిత్రం తర్వాత మహేష్తో జోడి కడుతుంది పూజా. ఇలా ఓ వైపు త్రివిక్రమ్తో, మరోవైపు మహేష్తో పూజా కలిసి పనిచేస్తూ గత హిట్ మ్యాజిక్లను రిపీట్ చేయబోతున్నారని చెప్పొచ్చు.