Pooja Hegde Blast in Bikini: బికినీలో మరోసారి రెచ్చిపోయిన పూజా హెగ్డే.. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత

First Published Jan 16, 2022, 10:06 AM IST

టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా  రాణిస్తున్న పూజా హెగ్డే.. ఇటీవల కంటిన్యూగా సినిమా షూటింగ్‌ల నుంచి రిలాక్స్ అవుతుంది. చిల్‌ అయ్యేందుకు ప్రయారిటీ  ఇస్తుంది. అందులో భాగంగా మరోసారి ఆమె వెకేషన్‌కి చెక్కేసినట్టు తెలుస్తుంది. 
 

తాజాగా పూజా హెగ్డే (Pooja Hegde) తన బికినీ ఫోటోని షేర్‌ చేసుకుంది. మాల్దీవుల్లో ఆమె బికినీలో పోజులిస్తూ రెచ్చిపోయింది. తన ఘాటైన అందాల విందుతో కుర్రాళ్లకి విందు భోజనం వడ్డించిందని చెప్పొచ్చు. గతేడాది ఇయిర్‌ ఎండింగ్‌లోనే మాల్దీవులకు చెక్కేసింది పూజా. అక్కడ వారం రోజుల పాటు గ్యాప్‌ లేకుండా ఎంజాయ్‌ చేసింది. ఇప్పుడు మరోసారి గ్లామర్‌ విందుకి తెరలేపింది.

మాల్దీవుల్లో బికినీలో ఓ కిర్రాక్‌ పోజు ఇచ్చింది. టూ పీస్‌ బికినీ, థైస్‌ కనిపించేలా ఉన్న పొట్టి షార్ట్ ధరించి Pooja Hegde పంచుకున్న పిక్‌ వైరల్‌ అవుతుంది.  అభిమానులను మెస్మరైజ్‌ చేస్తుంది. పూజా అంటే సామాజిక మాధ్యమాల్లో భారీ క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఉందనే విషయం తెలిసిందే. అయితే ఈ లేటెస్ట్ పిక్‌ ఇప్పటిదేనా? లేక గత వెకేషన్‌ ఫోటోనా అనేది క్లారిటీ లేదు. మొత్తానికి అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. దీనికి లక్షల్లో వ్యూస్‌ రావడం విశేషం. 

పూజా హెగ్డే సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటోగానీ, అప్‌డేట్లు గానీ పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. దీనికితోడు అప్పుడప్పుడు ఘాటైన ఫోటోలను, బికినీ పిక్స్ ని షేర్‌ చేసుకుంటూ కుర్రాళ్ల మతిపోగుతుంది. వారిని తన బుట్టలో వేసుకుంటుంది. ఇన్‌స్టాలో ప్రస్తుతం ఈ బ్యూటీకి 17మిలియన్స్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. 

ఇక అన్ని కుదిరితే పూజా హెగ్డే ఈ సంక్రాంతికి ఆడియెన్స్ ని అలరించాల్సింది. ఆమె ప్రభాస్‌తో కలిసి నటించిన `రాధేశ్యామ్‌` చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. కానీ కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆ సినిమాని వాయిదా వేశారు. దీంతో పూజా ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. మరోవైపు ఆమె నటించిన మరో సినిమా `ఆచార్య` ఫిబ్రవరి 4న విడుదల  కావాల్సింది. కానీ అది కూడా వాయిదా పడింది. వైరస్‌ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా వేస్తున్న చిత్రం బృందం శనివారం ప్రకటించారు. దీంతో రెండు రకాలుగా తన అభిమానులను డిజప్పాయింట్‌ చేసింది  పూజా హెగ్డే. 
 

పూజా హెగ్డే ఇప్పుడు టాప్‌ స్టార్లకి బెస్ట్ ఆప్షన్‌గా మారింది. స్టార్‌ హీరోలకు జోడీగా పూజానే  ఫస్ట్ ఛాయిస్‌ అవుతుంది. ఆమె ఇటీవల నటించిన చిత్రాలన్నీ సక్సెస్‌ కావడంతో అందరి చూపు పూజా పై పడింది. ప్రస్తుతం `రాధేశ్యామ్‌`, `ఆచార్య`, తమిళంలో `బీస్ట్`  చిత్రాలు చేస్తున్న పూజా హెగ్డే. మరోవైపు కొత్త ప్రాజెక్ట్ లకు సిద్ధమవుతుంది. 

ఇప్పటిక పూజా.. మహేష్‌తో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందాల్సిన చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. వీటితోపాటు పవన్‌ కళ్యాణ్‌,  హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న `భవదీయుడు భగత్‌సింగ్‌` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైందని టాక్‌. అలాగే బన్నీతో మరో సినిమా చేసే కమిట్‌మెంట్‌ ఉందని సమాచారం. వీటితోపాటు మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది. మొత్తానికి బుట్టబొమ్మ దూకుడు మామూలుగా లేదని చెప్పొచ్చు. 

click me!