ఇన్నాళ్లుగా దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూటర్గా ఆధిపత్యం చెలాయించారు. ఆయనతో విభేదాలు వచ్చిన తరువాత, మైత్రి వారు సొంత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి పేరుతో మెదలెట్టారు. ఆదిపురుష్, సాలార్, హనుమాన్ వంటి చిన్నా, పెద్ద చిత్రాల థియేట్రికల్ హక్కులను కూడా ఫ్యాన్సీ ధరలకు కొనుగోలు చేసి రిలీజ్ చేసారు. ఈ క్రమంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి కూడా ఎగ్జిబిషన్ పరిశ్రమలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతోంది. వారు చాలా స్క్రీన్లను లీజుకు తీసుకున్నారు.