దీనికి పవన్ సీరియస్ అయ్యాడట. `నేను ఒక్క మామిడి పండ్లే పండిస్తున్నా, నువ్వు ఇన్ని పండిస్తున్నావని నా వద్ద కటింగ్ ఇవ్వడానికి పంపిస్తున్నావా? అని ఫైర్ అయ్యాడట(సరదాగా). అంతటి రిలేషన్ తమ మధ్య ఉందన్నారు వేణు మాధవ్. గతంలో ఓసారి అలీతో సరదాగా షోకి వెళ్లినప్పుడు వేణు మాధవ్ అలీతో ఈ విషయాన్ని బయటపెట్టారు.
ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే వేణు మాధవ్ ఆరేళ్ల క్రితం లివర్, కిడ్నీ సమస్యతో కన్నమూసిన విషయం తెలిసిందే. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు డైరెక్టర్ కాబోతున్నాడట.