పవన్‌ కళ్యాణ్‌, వేణు మాధవ్‌ మధ్య రహస్య ఒప్పందం.. డిప్యూటీ సీఎం చాలా మిస్‌ అవుతున్నట్టే?

Published : Jan 25, 2025, 04:13 PM IST

పవన్‌ కళ్యాణ్‌ తో తనకున్న రహస్య ఒప్పందం గురించి బయటపెట్టాడు కమెడియన్‌ వేణు మాధవ్‌. ఇద్దరు అవి ఇచ్చిపుచ్చుకుంటారట. ఈ క్రమంలో పవన్‌ కోప్పడ్డ సందర్భంగా కూడా ఉందట.   

PREV
15
పవన్‌ కళ్యాణ్‌, వేణు మాధవ్‌ మధ్య రహస్య ఒప్పందం.. డిప్యూటీ సీఎం చాలా మిస్‌ అవుతున్నట్టే?

వేణు మాధవ్‌ తనదైన కామెడీతో తెలుగు ఆడియెన్స్ ని అలరించారు. ఆద్యంతం నవ్వులు పూయించారు. తాను తిట్లు తింటూ, తాను దెబ్బలు తింటూ, తాను అందరిచేత అవమానం పొందుతూ ఆడియెన్స్ ని నవ్వించారు. అదే సమయంలో సినిమాల్లో తన పాత్రలతో ఓవర్‌ యాక్టింగ్‌ చేస్తూ చివరికి పప్పుగా మారి నవ్వించారు. నవ్వించడం కోసం ఏమైనా చేసేవారు. 
 

25

అలాంటి వేణు మాధవ్‌ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వేణు మాధవ్‌కి సంబంధించి ఓ రేర్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో పవన్‌ కళ్యాణ్‌తో తాను చేసుకున్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాడు. మరి ఆ ఒప్పందమేంటి? అనేది చూస్తే. 
 

35

వేణు మాధవ్‌ ఒకప్పుడు స్టార్‌ కమెడియన్‌గా రాణించారు. అప్పట్లో పవన్‌ కళ్యాణ్‌ అన్ని సినిమాల్లోనూ వేణు మాధవ్‌ కనిపించేవారు. అంతేకాదు పర్సనల్‌గా ఇద్దరికీ కామన్‌ విషయాలు ఉన్నాయి. పవన్‌ ఫామ్‌ హౌజ్‌లో ఉంటూ వ్యవసాయం చేస్తుంటారు. పండ్లతోటలు, ఆర్గానిక్‌ ఫుడ్‌ పండిస్తుంటాడు. అలాగే వేణు మాధవ్‌కి కూడా పది ఎకరాల ఫామ్‌ ఉంది. అందులో తాను కూడా వ్యవసాయం చేస్తాడట. వరి, కూరగాయలు పండిస్తుంటాడట. 
 

45

ఈ క్రమంలో తాను పండించే వరి పంట నుంచి ఒక బస్తా బియ్యం పవన్‌ కళ్యాణ్‌ కి పంపిస్తుంటాడట వేణు మాధవ్‌. దీనికి బదులుగా పవన్‌ ఫామ్‌ హౌజ్‌లో పండే మామిడి పండ్లు ఒక బాక్స్ వేణు మాధవ్‌కి వస్తుంటుందట. ఇది తామిద్దరం చేసుకున్న రహస్య ఒప్పందమని తెలిపారు వేణు మాధవ్‌. చాలా ఏళ్లుగా ఇది తమ మధ్య జరుగుతుందన్నారు. అయితే తాను ఓ అడుగు ముందుకేసి బియ్యంతోపాటు కందులు, పెసర్లు కూడా పంపించాడట వేణు మాధవ్‌. 
 

55

దీనికి పవన్‌ సీరియస్‌ అయ్యాడట. `నేను ఒక్క మామిడి పండ్లే పండిస్తున్నా, నువ్వు ఇన్ని పండిస్తున్నావని నా వద్ద కటింగ్‌ ఇవ్వడానికి పంపిస్తున్నావా? అని ఫైర్‌ అయ్యాడట(సరదాగా). అంతటి రిలేషన్‌ తమ మధ్య ఉందన్నారు వేణు మాధవ్‌. గతంలో ఓసారి అలీతో సరదాగా షోకి వెళ్లినప్పుడు వేణు మాధవ్‌ అలీతో ఈ విషయాన్ని బయటపెట్టారు.

ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఇదిలా ఉంటే వేణు మాధవ్‌ ఆరేళ్ల క్రితం లివర్‌, కిడ్నీ సమస్యతో కన్నమూసిన విషయం తెలిసిందే. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు డైరెక్టర్‌ కాబోతున్నాడట. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories