పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష ఎందుకు..? అసలు ఎవరు వారాహి..? దీక్ష నియమాలేంటి..?

First Published Jun 28, 2024, 9:52 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టారు. డిప్యూటీ సీఎంగా ఆయన పని చేసుకుంటూనే దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే అసలు ఆయన ఈ దీక్ష ఎందుకు చేస్తున్నారు..? అసలు ఎవరు ఈ వారాహి అమ్మవారు. 

pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దాదాపు దశాబ్ధానికి పైగా కష్టపడిన ఆయన..ఎట్టకేలకు  ఏపీ డిప్యూటీ సీఎం  అయ్యారు. అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చేశారు.  జనసేన పార్టీ అధినేతగా పదేళ్ల పాటు.. ఉండి… ఓర్పుతో చివరకు సక్సెస్ అయ్యారు పవన్, కూటమితో కలిసి పోటీ చేసి ఏపీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు.

ప్రభాస్ ఫస్ట్ రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..? కల్కి కోసం ఎంత తీసుకున్నాడో తెలుసా...?

pawan varahi deeksha

ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పవర్ స్టార్ తాజాగా వారాహి దీక్ష చేపట్టారు. కాషాయం ధరించి.. ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. సాత్వికాహారం తీసుకుంటూ.. 11రోజులు దీక్షకు పూనారు. కాగా అసలు పవర్ స్టార్ ఈ వారాహి దీక్ష ఎందుకు చేస్తున్నారు...? కారణం ఏంటి..? అసలు ఎవరు ఈ వారాహి..? దీక్ష నీయమాలు ఏంటి..? ఇప్పుడు చేడానికి కారణం ఏంటి..? 

Pawan

జయం కోసం.. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు శక్తి కోసం.. చేసేపనులలో ఎటువంటి ఆటంకాలు కలుగకుండా వారాహి దీక్షను చేస్తారు. అందుకే పవర్ స్టార్ ఎన్నికల రధానికి కూడా వారాహి అమ్మవారి పేరు పెట్టారు. వారాహి మీద  కూడా వైసీపి విమర్శలు చేయగా.. ఆయన ఆ వాహనం నుంచే ప్రచారం చేసి..అఖండ విజయం సాధించారు. 

వారాహి మాత దుర్గాదేవి ప్రతిరూపం.. ఆమె ఏడు ప్రతిరూపాలలో వారాహి మాత కూడా ఒకరు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభుని శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి పాత్ర కనిపిస్తుంది. అంతే కాదు శ్రీ లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలు ఈ వారాహి అమ్మవారు అని అంటుంటారు. 
 

వరాహ రూపం కలిగిన ముఖం ఉండటం వల్ల అమ్మవారికి వారాహి అని పేరు వచ్చింది. చేతిలో నాగలి, దండం, శంఖుచక్రాలతో.. దర్శనం ఇస్తారు మాత, అంతే కాదు ఆమెకు గుర్రం,దున్నపోతు, సింహం వంటి పలు వాహనాలు కలిగి ఉంటుంది అని అంటుంటారు. అయితే  వారాహి అమ్మవారి గురించి  అందరికి తెలియదు. పురాణాల మీద పట్టుఉన్నవారు...అంతో ఇంతో ఆధ్యాత్మి జ్ఞానం కలిగిన వారికి మాత్రమే అమ్మవారి గురించి తెలుస్తుంది. 

Pawan

పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నుంచి.. అమ్మవారి గురించి ఎక్కవమంది తెలుసుకోగలిగారు. ఈ దీక్షగురించి కూడా చాలా తక్కువ మందికి తెలుసు.  ఇక  ఈ దీక్ష చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందులో  భాగంగా  కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. నేలపై పడుకుంటున్నారు. ఉదయం సాయంత్ర పూజ.. చన్నీటి స్నానం చేస్తారు. ఇవన్నీ చేస్తూ.. తమ వృత్తి తాము చేసుకోవచ్చు. 
 

Varahi campaign

ఇక ఈ వారాహి అమ్మవారి దీక్షను ఎప్పుడు చేస్తారంటే...  జేష్ఠ మాసం చివరిన..  ఆషాడ మాసం స్టార్ట్ అయ్యేటైమ్ లో అమ్మవారి దీక్ష చేపడతారు. ప్రతీ రోజు వారాహి స్తోత్రం పఠించడం తప్పనిసరి.  ఈ దీక్షను నవరాత్రి  టైమ్ లో కూడా కొంత మంది చేస్తుంటారు. నవరాత్రి టైమ్ లో మాత్రం వారాహి దీక్ష 9 రోజులు చేస్తారు.. ఇప్పుడు మాత్రం 11 రోజుల దీక్ష ఉంటుంది. ప్రస్తుతం పవన్ తమ ప్రభుత్వం.. పాలన సక్రమంగా జరగాలని.. ఈ దీక్ష చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!