సాయి ధరమ్ కి ప్రమాదం... దారుణ పరిస్థితులు తలచుకొని కన్నీరు పెట్టుకున్న పవన్, అసలు ఏం జరిగిందో చెబుతూ!

First Published Feb 2, 2023, 8:58 PM IST


సాయి ధరమ్ బైక్ యాక్సిడెంట్ కి గురికావడం మెగా ఫ్యామిలీలో పెద్ద కుదుపని చెప్పొచ్చు. మృత్యువు అంచుల వరకూ సాయి ధరమ్ వెళ్లారు. ఈ సంఘటన తలచుకుని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. 
 

PawanKalyan On Unstoppable

బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2లో పవన్ కళ్యాణ్ (PawanKalyan On Unstoppable)పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చకు వచ్చాయి. 2021 సెప్టెంబర్ లో సాయి ధరమ్ బైక్ ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ పరిస్థితి అత్యంత విషమంగా మారింది. స్థానిక ఆసుపత్రిలో చేర్చిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. దాదాపు నెల రోజులు ఆసుపత్రి బెడ్ కే పరిమితమైన సాయి ధరమ్ తిరిగి కోలుకున్నారు. ఈ సంఘటన తనను ఎంతగా కలచివేసిందో పవన్ కళ్యాణ్ చెప్పారు.

PawanKalyan On Unstoppable


సాయి ధరమ్ కి యాక్సిడెంట్ జరిగిన విషయం నాకు త్రివిక్రమ్ ఫోన్ చేసి చెప్పారు. వెంటనే నేను ఆసుపత్రికి వెళ్ళాను. తన పరిస్థితి చూసి చలించిపోయాను. ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతున్నా సాయి ధరమ్ కోమాలో నుంచి బయటకు రాలేదు. తనకు ఏమవుతుందనే ఆందోళనకు గురయ్యారు. 

అంతకు మించి బయట జరుగుతున్న ప్రచారం మరింత కలచివేసింది. ఓవర్ స్పీడ్లో బైక్ నడిపారు. తాగి ఉన్నాడంటూ  నిరాధార కథనాలు తెరపైకి తెచ్చారు. అవన్నీ వింటుంటే చాలా బాధేసేది. సాయి ధరమ్ తేజ్ నా ముందు చాలా వినయంగా ఉంటాడు. అది నటన అని అనుకుంటారు. చిన్నప్పటి నుండి వాళ్ళు అలానే పెరిగారని పవన్ చెప్పుకొచ్చారు. సాయి ధరమ్ గురించి మాట్లాడుతూ పవన్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ పరిణామం అందరి మనసులు బరువెక్కేలా చేసింది. 
 

Unstoppable


సాయి ధరమ్ మామయ్య పవన్ గురించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి నన్ను చదివించింది ఆయనే. నా చదువుకు అవసరమైన ఫీజులు కట్టేవారు. ఆయన నా బాధ్యత తీసుకున్నారు. పవన్ నాకు గురువుతో సమానం. 
 

ముంబైలో యాక్టింగ్ నేర్చుకునే రోజుల్లో నేను ఫ్లైట్ మిస్సయ్యాను. ఆ విషయం పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి చెప్పాను. నీకు డబ్బులు విలువ తెలియడం లేదురా... ఈసారి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్ళు అని నన్ను మందలించారు. చిన్నప్పటి నుండి అలా క్రమశిక్షణగా పెంచారని సాయి ధరమ్ చెప్పుకొచ్చారు. 
 

click me!