ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యే గెస్ట్ ల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మూడు రాష్ట్రాల నుంచి మంత్రులు హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేయబోతున్నారట. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కర్ణాటక అటవీ శాఖా మంత్రి ఈశ్వర ఖండ్రే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈశ్వర ఖండ్రేని స్వయంగా ఏఎం రత్నం ఇన్వైట్ చేశారు.