త్రివిక్రమ్ తో ఇప్పటికీ తేలని గొడవ అదే.. పవన్ పై మరింతగా గౌరవం పెరిగిందన్న బాలయ్య

First Published Feb 3, 2023, 12:26 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ ఆహాలో నిన్నటిని నుంచి ప్రసారం మొదలయింది. సహజంగానే బిడియంతో ఉండే పవన్.. గోల గోల చేసే బాలయ్య మధ్య సంభాషణ ఎలా జరిగింది అంటూ అందరిలో ఉత్కంఠ నెలకొంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ ఆహాలో నిన్నటిని నుంచి ప్రసారం మొదలయింది. సహజంగానే బిడియంతో ఉండే పవన్.. గోల గోల చేసే బాలయ్య మధ్య సంభాషణ ఎలా జరిగింది అంటూ అందరిలో ఉత్కంఠ నెలకొంది. అంచనాలకు తగ్గట్లుగానే తొలి ఎపిసోడ్ సూపర్ హిట్ గా నిలిచింది. 

బాలయ్య పవన్ ని రాజకీయాల గురించి, వ్యక్తిగత జీవితం, పెళ్ళిళ్ళు, త్రివిక్రమ్ తో స్నేహం ఇలా పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. బాలయ్య అల్లరిని పవన్ ఎంజాయ్ చేస్తూనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. త్రివిక్రమ్ తో స్నేహం ఎలా కుదిరింది అని బాలయ్య ప్రశ్నిస్తే.. చేయాల్సి వచ్చింది అని పవన్ సరదాగా ప్రోమోలో బదులివ్వడం చూసాం. 

ఎపిసోడ్ లో త్రివిక్రమ్ తో స్నేహం గురించి పూర్తిగా ఓపెన్ అయ్యారు పవన్. త్రివిక్రమ్ గారు మొదట నన్ను కలిసినప్పుడు ఫామ్ హౌస్ లో పని చేసుకుంటున్నా. ఆ ఆ తర్వాత మేమిద్దరం స్నేహితులుగా మారాల్సి వచ్చింది. ఇప్పటికీ ఒక విషయంలో మా మధ్య గొడవ తేలట్లేదు. త్రివిక్రమ్ గారు మొదట నాకు చెప్పిన కథ అతడు అని తెలియదు. ఆ కథ చెప్పటప్పుడు ఎందుకు నిద్ర పోయావ్ అని ఇప్పటికి వాదిస్తుంటారు. 

నేను నిద్రపోలేదు అని చెప్పినా వినట్లేదు అని పవన్ అన్నారు. క్రమంగా మా ఇద్దరి మధ్య పుస్తకాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పురాణాల గురించి చర్చ మొదలైంది. ఇప్పుడు త్రివిక్రమ్ గారిని స్నేహితుడి కంటే గురువుగా భావిస్తాను అని పవన్ అన్నారు. 

దీనితో బాలయ్య మాట్లాడుతూ.. ఒక దర్శకుడు రచయితని గురువు స్థానంలో చూస్తున్నావ్ అంటే నీ మీద ఇంకా గౌరవం పెరుగుతోంది అని బాలయ్య అన్నారు. ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తన పెళ్లిళ్ల గురించి వివరణ ఇవ్వడం, రాంచరణ్ తో ఫోన్ సంభాషణ, సాయిధరమ్ తేజ్ ఎంట్రీ లాంటివి హైలైట్ అయ్యాయి.

పవన్ అభిమానుల కోసం ఈ ఎపిసోడ్ ని స్పెషల్ స్క్రీనింగ్ కూడా ప్రదర్శించారు. ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ లోని హైలైట్స్ గురించి చర్చించుకుంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.   

click me!