అరెస్ట్ తర్వాత తొలిసారి నాగార్జున ముందుకు పల్లవి ప్రశాంత్..ఇంత జరిగినా సవాల్ విసురుతున్నాడే

First Published Jan 7, 2024, 11:47 AM IST

అరెస్ట్ తర్వాత పల్లవి ప్రశాంత్ ఎక్కడా కనిపించలేదు. సైలెంట్ గా ఇంట్లో ఉంటూ తన పనులు తాను చేసుకుంటున్నాడు. శివాజీ మాత్రం తాను నటించిన వెబ్ సిరీస్ ని హౌస్ నుంచి బయటకి వచ్చి రిలీజ్ చేసేశాడు.

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 7 ఎంతటి వినోదాన్ని అందించిందో అదే రేంజ్ లో వివాదాలు కూడా కారణం అయింది. సీజన్ 7 అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఫినాలే ముగిసిన తర్వాత కూడా ఆడియన్స్ బిగ్ బాస్ ని మరచిపోవడం లేదు. పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగిన వివాదాలే అందుకు కారణం. మరో వైపు శివాజీ కెరీర్ లో కూడా మునుపటి జోష్ వచ్చేసింది. అమర్ దీప్ కూడా క్రేజీ సెలబ్రిటిగా మారిపోయాడు. 

అరెస్ట్ తర్వాత పల్లవి ప్రశాంత్ ఎక్కడా కనిపించలేదు. సైలెంట్ గా ఇంట్లో ఉంటూ తన పనులు తాను చేసుకుంటున్నాడు. శివాజీ మాత్రం తాను నటించిన వెబ్ సిరీస్ ని హౌస్ నుంచి బయటకి వచ్చి రిలీజ్ చేసేశాడు. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటివి విన్ ఓటిటిలో జనవరి 5 నుంచి అవుతోంది. ఈ నేపథ్యంలో శివాజీ వరుసగా యూట్యూబ్ ఛానల్స్ లో, టివి ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ వెబ్ సిరీస్ లో శివాజీ ముగ్గురు పిల్లల తండ్రిగా టీచర్ గా నటిస్తున్నారు. 

Latest Videos


ఇక అమర్ దీప్ బిగ్ బాస్ ఫినాలే తర్వాత కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లినప్పటికీ తిరిగి వచ్చి యాక్టివ్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా మరోసారి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ చిత్రం కోసం వీళ్లంతా ఏకం కాబోతున్నారు. 

నా సామిరంగ చిత్రం ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో నాగ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు. స్టార్ మా లో నా సామిరంగ అనే స్పెషల్ ప్రోగ్రాంని సంక్రాంతికి రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలయింది. బిగ్ బాస్ 7లో సందడి చేసిన శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంకతో పాటు మాజీ కంటెస్టెంట్స్ కూడా పాల్గొంటున్నారు. 

అరెస్ట్ తర్వాత పల్లవి ప్రశాంత్ కెమెరా ముందు కనిపించడం ఇదే తొలిసారి. అయితే ఇంత రచ్చ జరిగినప్పటికీ ప్రశాంత్ లో ఆ హీట్ తగ్గలేదు. ఈ షోలో కూడా శివాజీ గ్రూపు.. అమర్ దీప్ గ్రూపుగా రెండుగా విడిపోయారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ ఒక జట్టు అయితే.. అమర్ దీప్, ప్రియాంక, శోభా మరో జట్టు. శివాజీ వాళ్ళ ఊరిపేరు మొగ్గా పురం.. అమర్ వాళ్ళ ఊరిపేరు చుక్కా పురం. వీళ్ళ లక్ష్యం నాగార్జున గారిని వాళ్ళ ఊరికి తీసుకుని వెళ్లి సంక్రాంతి సెలెబ్రేట్ చేయడమే. 

పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ.. బరాబర్ నాగార్జున సర్ మా ఊరికే వస్తారు.. ఈ విషయంలో తగ్గేదే లే అని సవాల్ విసురుతున్నాడు. లేదు మా ఊరికే వస్తారు అని అమర్ అంటాడు. ఈ విషయంలో అమర్, ప్రశాంత్ మధ్య గొడవ జరుగుతుంది. సుమ కూడా ఈ షోలో మెరిసింది. ఆమె యాంకర్ గా ఈ షోని నడిపిస్తోంది. ఇంతలో నాగార్జున.. హీరోయిన్ ఆషిక రంగనాథ్, అల్లరి నరేష్ లతో ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు. ఇంతకీ నాగార్జున ఎవరి ఊరికి వెళ్లారు ? ఈ షోలో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి ఏమైనా మాట్లాడారా తెలియాలంటే సంక్రాంతికి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే. 

click me!