కంగనా ఘాటు అందాలకు ఆస్కార్‌ నటుడు ఫిదా.. సినిమా చేయాలనే కోరికని బయటపెట్టిన `గ్లాడియేటర్‌`

First Published Aug 14, 2021, 12:02 PM IST

ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఇటీవల పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతున్నాయి. ఆమె అందాలకు అనేక మంది నెటిజన్లు మాత్రమే కాదు సినీ తారలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా హాలీవుడ్‌ ఆస్కార్‌ నటుడు కూడా ఫిదా అయ్యాడట‌. అంతేకాదు కంగనాతోనూ సినిమా ప్రపోజల్స్ వస్తున్నాయట.
 

Kangana Ranaut

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ శుక్రవారం సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. తాను నటిస్తున్న `ధాఖడ్‌` చిత్రంలోని ఓ సాంగ్‌ షూట్‌లో భాగంగా ట్రాన్ఫరెన్సీ డ్రెస్‌లో ఫోటోలకు పోజులిచ్చింది. వీటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అంతే ఆయా ఫోటోలు అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అయ్యాయి. దుమ్ముదుమారం క్రియేట్‌ చేశాయి. 

Kangana Ranaut

ఈ పిక్స్ హాలీవుడ్‌ స్టార్స్ ని సైతం ఎట్రాక్ట్ చేశాయట. తాజాగా వాటికి సంబంధించిన డిస్కషన్‌ సోషల్‌ మీడియాలో జరగడమే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అంతేకాదు దీనిపై ఈ ఆస్కార్‌ నటుడు స్పందించడం విశేసం. 

హాలీవుడ్‌ సంచలన చిత్రం `గ్లాడియేటర్‌` నటుడు రస్సెల్‌ క్రోవ్‌తో పనిచేయాలని కోరుతూ ఆయన అభిమానులు కంగనా పిక్స్ ని పంచుకున్నారు. సోషల్‌ మీడియాలో ఆయన్ని ట్యాగ్ చేశారు. దీంతో రస్సెల్‌ స్పందించారు. ఆ అభిమానుల ట్వీట్‌ని రీట్వీట్‌ చేయడం విశేషం. అంటే అభిమానుల కోరికపై ఆయన ఆసక్తి చూపించారని చెప్పొచ్చు. 
 

ఓ హాలీవుడ్‌ స్టార్‌ ఇండియన్‌ హీరోయిన్‌ అందానికి ఫిదా అయ్యాడనే విషయాన్ని ఆయన ఈ రూపంలో వ్యక్తం చేశారు. ఇక అందులో అభిమానులు ` రెండు విభిన్న చిత్ర పరిశ్రమలకు చెందిన ఇద్దరు గొప్ప నటులు, అకాడమీ విజేత రస్సెస్‌ క్రోవ్‌, నాలుగు సార్లు జాతీయ అవార్డు విజేత కంగనా కలిసి ఓ సినిమా చేస్తే ఎంత బాగుంటుంది` అని ట్వీట్‌ చేశారు. దీన్ని రీట్వీట్‌ చేశారు.

మరికొందరు అభిమానులు దీనిపై స్పందిస్తూ, వారిద్దరు కలిస్తే అద్భుతమైన జోడీ అవుతుంది. అది అద్బుతంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమా కోసం ఆతృతగా ఉన్నామని ఒకరు, `ఎస్‌ ఇది చాలా బాగుంటుంద`ని మరొకరు కామెంట్లు పెట్టారు. దీంతో ఇప్పుడు ఇంటర్నేషనల్‌ వైడ్‌గా చర్చనీయాంశంగా మారింది. మరి ఇది నిజంగానే జరుగుతుందా? అన్నది ఆసక్తికరంగా,సస్పెన్స్ గా మారింది. 

అదే సమయంలో ఇది జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, ఐశ్వర్యా రాయ్‌ వంటి తారలు హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. అక్కడి సూపర్‌ స్టార్లతో జోడీ కట్టారు. అందులో భాగంగా దర్శకనిర్మాతలు గట్టిగా ఫోకస్‌ పెడితే రస్సెల్‌, కంగనాని ఒకే తెరపై చూడటం కూడా సాధ్యమే అని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక హాలీవుడ్‌ నటుడు రస్సెల్‌ `గ్లాడియేటర్‌` చిత్రానికి ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు. దీంతోపాటు `ది ఇన్‌సైడర్‌`, `ఏ బ్యూటీఫుల్‌ మైండ్‌`, `ఎల్‌ ఏ కాన్ఫిడెన్షియల్‌`, `మాస్టర్ అండ్ కామాండర్‌`, `అమెరికన్‌ గ్యాంగ్‌స్టర్‌`,`రాబిన్‌ హుడ్‌`, `సిండ్రెలెల్లా మ్యాన్‌` వంటి బ్లాక్‌ బస్టర్స్ లో నటించారు. ప్రస్తుతం ఆయన `ది జార్జ్‌ టౌన్‌ ప్రాజెక్ట్`, `థోర్‌ః లవ్‌ అండ్‌ థండర్‌` చిత్రాల్లో నటిస్తున్నారు.
 

Kangana Ranaut

కంగనా ప్రస్తుతం `ధాఖడ్‌` చిత్రంతోపాటు `తలైవి`, `తేజాస్‌`తోపాటు `మణికర్ణిక రిటర్న్స్ః ది లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా` చిత్రాల్లో నటిస్తుంది. `మణికర్ణిక రిటర్న్స్`కి తనే దర్శకత్వం వహించాలనే ప్లాన్‌లో ఉంది కంగనా. 

click me!