ఓటీటీలో దూసుకెళ్తున్న ‘ఓదెల రైల్వే స్టేషన్’.. మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూస్.!

First Published Aug 30, 2022, 2:47 PM IST

 టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) అందించిన కథ, స్క్రీన్ ప్లే తో హేబా పటేల్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’.  చిత్రానికి అశోక్ తేజ్ దర్శకత్వం వహించారు. ఓటీటీలో వచ్చిన ఈ మూవీ రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకుపోతోంది.

యంగ్ హీరోయిన్ హేబా పటేల్ (Hebah Patel) లీడ్ రోల్ లో నటించిన రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station). ఓటీటీలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రికార్డు వ్యూస్ తో సత్తా చాటుతోంది.  
 

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లే తో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటించారు. అశోక్‌ తేజ్‌ దర్శకత్వం వహించారు. కెకె రాధా మోహన్‌ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది. 

చిత్రంలోని థ్రిల్లింగ్ మూమెంట్స్, సంగీతం, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉండటంతో ఓటీటీ ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది. దీంతో రోజురోజుకు వ్యూయర్ షిప్ పెరుగుతోంది. సినిమాపై మౌత్ పబ్లిసిటీ కూడా జరుగుతోంది. ఓటీటీలో ప్రస్తుతం ఈ చిత్రం అదరగొడుతోంది.  
 

తాజాగా సంపత్ నంది అందించిన సమాచారం మేరకు.. కేవలం మూడు రోజుల్లోనే ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీ 1.5 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను పూర్తి చేసుకున్నట్టుగా తెలిపారు. ఓటీటీలో మూవీకి లభిస్తున్న స్పందనకు సంతోషంగా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఒకవైపు టాలీవుడ్ స్టార్స్ తో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను తెరకెక్కిస్తూనే ఇటు తన పర్యవేక్షణలో ప్రేక్షకాదరణ పొందే సినిమాలను  రూపొందిస్తుండటం పట్ల ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ‘ఓదెల రైల్వే స్టేషన్’ పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. చివరిగా సంతప్ నంది గోపీచంద్ తో ‘సిటీ మార్’ చిత్రాన్ని తెరకెక్కించారు. 
 

click me!