ఒకే వేదికపై సూపర్ స్టార్ రజనీకాంత్, ఎన్టీఆర్.. పునీత్ రాజ్ కుమార్ కోసం బెంగళూరుకి..

First Published Oct 29, 2022, 9:56 AM IST

గత ఏడాది అక్టోబర్ లో దేశం మొత్తాన్ని తీవ్ర విషాదంలో ముంచుతూ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

గత ఏడాది అక్టోబర్ లో దేశం మొత్తాన్ని తీవ్ర విషాదంలో ముంచుతూ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. గత ఏడాది జరిగిన అత్యంత విషాదకర సంఘటన ఇదే అని చెప్పాలి. పునీత్ రాజ్ కుమార్ కన్నడ నాట కోట్లల్లో అభిమానులని సొంతం చేసుకున్నారు. 

ఇప్పటికీ అభిమానులు పునీత్ మృతిని జీర్ణించుకోలేకున్నారు. నేటితో పునీత్ మరణించి ఏడాది గడుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఎన్నో సేవాకార్యక్రమాలు కూడా నిర్వహించారు. పునీత్ ఖ్యాతిని గుర్తిస్తూ కన్నడ ప్రభుత్వం 'కన్నడ రత్న' బిరుదుని ప్రకటించారు. 

నవంబర్ 1న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆధ్వర్యంలో ఈ బిరుదు అందించబోతున్నారు. దీనికోసం భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరు కానున్నారు. సౌత్ నుంచి ఇద్దరు బిగ్ స్టార్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అది మరెవరో కాదు.. సూపర్ స్టార్ రజనీకాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. 

రజనీకాంత్ తో ఎన్టీఆర్ వేదిక పంచుకోనుండడం ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ కి పునీత్ రాజ్ కుమార్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. పునీత్ కోసం ఎన్టీఆర్ ఒక చిత్రంలో పాట కూడా పాడారు. నందమూరి ఫ్యామిలీకి, పునీత్ కుటుంబానికి దశాబ్దాలుగా మంచి రిలేషన్ ఉంది. 

పునీత్ మరణించినప్పుడు ఎన్టీఆర్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే.  కన్నడ నాట అభిమానులు పునీత్ ని ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు. ఈ కార్యక్రమంలో పునీత్ భారీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. 

పునీత్ మరణం అకస్మాత్తుగా జరిగిపోయింది. గత ఏడాది ఇదే రోజున పునీత్ జిమ్ చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పునీత్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 

click me!