కోడి మొత్తానికి ఉప్పు కారం గట్టిగా దట్టించేవారట. మంచి ఘాటుగా ఉండేలా చేసి ఆ కోడి మొత్తం తినేవారట. మెడిసిన్ వేసుకోకుండా ఇలా కోడిని తిని మొత్తం దుప్పటి కప్పుకుని పడుకునేవారట. ఫ్యాన్స్ కూడా వేసుకునేవారు కాదు. ఆ హీట్కి ఉదయం లేచేసరికి దుప్పటి మొత్తం తడిచిపోయేదని, దీంతో ఆయన జ్వరం మటు మాయమని తెలిపారు బాలకృష్ణ. తనకు కూడా ఎప్పుడైనా జ్వయం వస్తే ఇలానే చేయమని అక్క లోకేశ్వరి చెబుతుండేది, కానీ నా వల్ల కాదని చెబుతుండేవాడిని అన్నారు బాలయ్య. `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 4` షోలో ఈ విషయాన్ని తెలిపారు. నాల్గో సీజన్కి మొదటి గెస్ట్ గా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయన్ని అరెస్ట్ చేయడం, జైలు జీవితం, తనపై జరిగిన కుట్ర, పవన్ కల్యాణ్ సపోర్ట్, ఎన్నికల గెలుపు, తాను భవిష్యత్లో చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చంద్రబాబు నాయుడు తెలిపారు.