నిత్యా మీనన్ ని పెళ్లి చేసుకోమని బలవంతం చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.. ఎట్టకేలకు నోరు విప్పింది

First Published Aug 20, 2022, 1:32 PM IST

నటనతో ఎలాంటి పాత్రలో అయినా జీవించగల నటి నిత్యా మీనన్. కళ్ళతోనే హావభావాలు పలికించే నటీమణులు చాలా అరుదు. ఆ అద్భుతమైన ప్రతిభ నిత్యామీనన్ సొంతం.

నటనతో ఎలాంటి పాత్రలో అయినా జీవించగల నటి నిత్యా మీనన్. కళ్ళతోనే హావభావాలు పలికించే నటీమణులు చాలా అరుదు. ఆ అద్భుతమైన ప్రతిభ నిత్యామీనన్ సొంతం. నిత్యామీనన్ నుంచి దర్శకులు ఎలాంటి ఎమోషన్ అయినా రాబట్టుకోవచ్చు. నిత్యా మీనన్ ఏ చిత్రంలో నటించినా అందులో ఆమె మార్క్ కనిపిస్తుంది. 

హీరోయిన్ల గురించి అనేక రూమర్స్ వినిపించడం సహజమే. కానీ నిత్యా మీనన్ వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఓ మళయాలం యూట్యూబర్ పదేపదే ఫోన్స్ చేసి విసిగించినట్లు ఇటీవల నిత్యామీనన్ తెలిపింది. ఈ న్యూస్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నిత్యా మీనన్ ఓ స్టార్ హీరో ని వివాహం చేసుకోబోతున్నట్లు రూమర్స్ వైరల్ అయ్యాయి. 

దీనిపై నిత్యామీనన్ తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చింది. నాకు కాలు బెణకడంతో డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నారు. ఒక ఏడాది నేను కూడా బ్రేక్ తీసుకోవాలనుకున్నా. ఆ టైంలో కథలు కూడా వినలేదు. దీనితో నిత్యామీనన్ పెళ్ళికి రెడీ అయిపోతోంది అని ఎవరికి వారు ఊహించేసుకున్నారు. అలా నాపై అసత్య ప్రచారం మొదలయింది అని నిత్యా మీనన్ తెలిపింది. 

తనని వివాహం చేసుకోవాలని ఓ స్టార్ హీరో బలవంతం చేసినట్లు వచ్చిన న్యూస్ గురించి కూడా నిత్యా మీనన్ క్లారిటీ ఇచ్చింది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ నాకు మంచి స్నేహితుడు. దుల్కర్ సల్మాన్ కి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. తన ఫ్యామిలీతో తాను చాలా హ్యాపీగా ఉన్నాడు. నన్ను కలిసిన ప్రతి సారీ నువ్వు కూడా పెళ్లి చేసుకుని సెటిల్ కావాలి అని చెబుతుంటాడు. తాను ఎప్పుడు వివాహం చేసుకుంటానో ముందే చెప్పలేను అని అతడికి సమాధానం ఇచ్చినట్లు నిత్యా మీనన్ పేర్కొంది. 

ఇక తనని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు కొందరు పుకార్లు పుట్టించారని నిత్యా మీనన్ మండిపడింది. మనం ఎదుగుతునప్పుడు కిందకి లాగాలనుకునే వాళ్ళు ఉంటారు. కొందరు ప్రలోభాలకు గురిచేస్తుంటారు. వాళ్ళ ప్రలోభాలకు లొంగనప్పుడు ఇలాంటి రూమర్స్ వస్తుంటాయి. ఆమెతో వేగడం చాలా కష్టం అని బయట చెబుతుంటారు. కానీ నాతో వర్క్ చేసేవాళ్ళందరూ ఎప్పుడూ అలా ఫీల్ కాలేదు. ఎందుకంటే నేనెంటో వారందరికీ తెలుసు అని నిత్యామీనన్ తెలిపింది. 

నిత్యా మీనన్ చివరగా తెలుగులో భీమ్లా నాయక్ చిత్రంలో నటించింది. హీరో ధనుష్ సరసన తమిళంలో నిత్యా నటించిన 'తిరుచిత్రామ్బలం' చిత్రం గురువారం విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 

click me!