నిహారిక కొణిదెల తాజాగా ఇంటర్వ్యూలో విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిహారిక విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు మొదటగా ఎవరికీ చెప్పిందో ఈ కథనంలో తెలుసుకోండి.
ఇటీవల మెగా డాటర్స్ నిర్మాతలుగా మెరుస్తున్నారు. చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, నాగబాబు డాటర్ నిహారిక నిర్మాతలుగా రాణిస్తున్నారు. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించి అందులో కథా ప్రాధాన్యం ఉన్న చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఆల్రెడీ కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా కూడా నిర్మించింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు.. అనేక అవార్డులు కూడా గెలుచుకుంది.
25
హారర్ కామెడీ చిత్రం
తాజాగా ఆమె నిర్మించిన హారర్ కామెడీ చిత్రం రాకాస ఏప్రిల్ 3న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ హీరోగా నటించారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో నిహారిక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా నిహారిక ఇంటర్వ్యూలలో స్పందిస్తోంది.
35
విడాకులపై ఆసక్తికర వ్యాఖ్యలు
తాను విడాకులు తీసుకున్న విషయం గురించి కూడా నిహారిక మాట్లాడింది. 2020లో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగింది. కానీ కొంత కాలానికే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు ముందుగా ఆ విషయాన్ని నిహారిక ఎవరితో పంచుకుందో తెలుసా ? తన తండ్రి నాగబాబుతో ఈ విషయాన్ని మొట్ట మొదట చెప్పినట్లు నిహారిక పేర్కొంది.
రిలేషన్ షిప్ నుంచి బయటకు రావాలి అనుకున్నప్పుడు నాన్నతో ఈ విషయం చెప్పాను. నేను సంతోషంగా లేను అనే విషయం నాన్నకు కూడా తెలుసు. దీనితో నేను చెప్పిందంతా విని సైలెంట్ అయ్యారు. సంతోషంగా లేకపోతే రిలేషన్ షిప్ లో బలవంతంగా కొనసాగాల్సిన అవసరం లేదు అని నాన్నగారు సలహా ఇచ్చారు.
55
విడాకులు కామన్
మా మధ్య వచ్చిన విభేదాలు పరిష్కారం కానివి అని ఫిక్స్ అయ్యాం. అందుకే పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవ్వరూ కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు. ఇటీవల విడాకులు కామన్ అయిపోయాయి అని మాట్లాడుతున్నారు. గతంలో కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. కానీ అప్పట్లో మహిళలు తిరిగి పుట్టింటికి వెళితే నాన్న పోషించగలడా అనే సందేహం ఉండేది. అందుకే భయంతో రిలేషన్ షిప్ లో కొనసాగేవారు అని నిహారిక పేర్కొంది.