రీసెంట్ గా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్క చోట చేరి సంక్రాంతిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్, వరుణ్ లావణ్య జంట ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్క చోట చేరి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ సంక్రాంతి సెలెబ్రేషన్స్ లో కొత్త మెగా కోడలు లావణ్య త్రిపాఠి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మెగా ఫ్యామిలిలో తన ఆడపడుచులతో చాలా కలివిడిగా కనిపించింది. అంతా కలసి చాలా గ్రాండ్ గా సంక్రాంతిని సెలెబ్రేట్ చేసుకున్నారు.
ఆ దృశ్యాలు ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నాయి. ముఖ్యంగా నిహారిక తన వదినతో కలసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. నిహారిక, సుష్మిత కొణిదెల, లావణ్య త్రిపాఠి ముగ్గురూ సంక్రాంతి వంటకాలు చేస్తూ కనిపించారు.
నిహారిక, లావణ్య త్రిపాఠి కలసి క్రేజీగా డ్యాన్స్ చేశారు. ఈ దృశ్యాలన్నీ మెగా అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. కుటుంబం, సంతోషం రెండూ ఒక్క చోట చేరితే ఇలాగే ఉంటుంది అంటూ లావణ్య కామెంట్ పెట్టింది.
పెళ్లైన తర్వాత లావణ్య త్రిపాఠికి తొలి సంక్రాంతి చాలా గ్రాండ్ గా జరిగింది. గత ఏడాది నవంబర్ లో లావణ్య, వరుణ్ తేజ్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ లో వరుణ్ లావణ్య మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఎక్కడగా తమ ప్రేమ గురించి బయట పడకుండా ఎంగేజ్మెంట్ వరకు లావణ్య, వరుణ్ జాగ్రత్త పడ్డారు.
మిస్టర్ మూవీతో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం వివాహబంధంలో అడుగుపెట్టే వరకు సాగింది.ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ కపుల్ తమ పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.