సమంత హెల్త్ కండిషన్ పై వదంతులు, సౌత్ కొరియాకి పయనం.. వాస్తవం ఏంటంటే..

First Published Nov 30, 2022, 5:43 PM IST

సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. సమంత ఈ వ్యాధి నుంచి కొంత కోలుకుంది. ఇటీవల యశోద చిత్ర ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంది.

సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. సమంత ఈ వ్యాధి నుంచి కొంత కోలుకుంది. ఇటీవల యశోద చిత్ర ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది.  యశోద ప్రమోషన్స్ లో సమంత నీరసంగా కనిపించింది. 

తాజాగా సమంత ఆరోగ్యంపై మరింతగా వదంతులు వ్యాపించాయి. సమంత మయోసైటిస్ నుంచి ఇంకా కోలుకోలేదని, ఆమె పరిస్థితి కాస్త ఇబ్బంది కరంగానే ఉందంటూ వదంతులు వ్యాపించాయి. సమంత మెరుగైన చికిత్స కోసం సౌత్ కొరియాకి వెళుతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. 

ఈ పుకార్లపై సమంత టీం తాజాగా స్పందించింది. అవి కేవలం రూమర్స్ మాత్రమే అని కొట్టిపారేశారు. సమంత దక్షిణ కొరియా వెళ్లడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాంటిది ఏమీ లేదని సమంత ప్రస్తుతం కోలుకుంటోంది అని క్లారిటీ ఇచ్చారు. 

ఒకరి ఆరోగ్యం గురించి ఇలాంటి వదంతులు సృష్టించడం వల్ల అనవసరమైన గందరగోళం నెలకొంటుంది. అభిమానుల్లో ఆందోళన పెంచే ఈ రకమైన పుకార్లు సృష్టించడం ఏంటి అంటూ సమంత టీం మండిపడింది. సమంత యశోద చిత్ర షూటింగ్ పూర్తయ్యాక మయోసైటిస్ అనే వ్యాధి బారీన పడింది. సమంత ఇప్పటికే అమెరికాలో చికిత్స తీసుకుంది. 

ఆరోగ్యం కుదుటపడుతోంది అనే నమ్మకం కలిగాకే ఇండియాకి తిరిగి వచ్చింది. సమంత ఈ న్యూస్ ప్రకటించినప్పుడు అభిమానులు, సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇదిలా ఉండగా సమంత కేరళకి వెళ్లనుందని, అక్కడ ఆయుర్వేద చికిత్స తీసుకోనుందని కూడా వార్తలు వచ్చాయి.  

ఇంత ప్రమాదకర వ్యాధితో బాధపడుతూ కూడా సమంత యశోద చిత్రంతో అద్భుతంగా నటించింది. యశోద చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. సమంత సోలో హీరోయిన్ గా యశోద రూపంలో మరో హిట్ ఆమె ఖాతాలో పడింది. 

click me!