40 ఏళ్లు వస్తున్నా ఇంకా హీరోయిన్ గా కొనసాగుతుంది నయనతార. సౌత్ హీయిన్లలో ఎక్కువ రెమ్యూనరేషన్ వసూలుచేస్తున్న హీరోయిన్ కూడా ఆమె. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఈసీనియర్ బ్యూటీ.. రీసెంట్ గా హిందీలోకి కూడా అడుగు పెట్టింది. అడుగు పెట్టడంతోనే షారుఖ్ తో జతకట్ట.. వెయ్యి కోట్ల సినిమాను సాధించింది.
Nayanthara
ఇటు సౌత్ ఇండియాలో కూడా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో నయనతార ముందుటుంది. ఆమె నటించిన సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ రేటు ఎక్కువగా ఉండటంతోపాటు.. నయనతారకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది.దాంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. నయన్ ప్రస్తుతం సినిమాకు 15 నుంచి 20 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారట.
అయితే నయనతార సినిమా అంటే సక్సెస్ పక్కా అన్నఅభిప్రాయం ఉన్న నిర్మాతలు ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సై అంటున్నారట. ఇక తాజాగా నయనతార తెలుగులోఏం సినిమాలు చేయడం లేదు కాని.. తమిళంలో వరుసగా నటిస్తోంది. ఆమె ప్రస్తుతం తన భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ఎల్ఐసీ అనే టైటిల్ తో ఒక సినిమా కమిట్ అయ్యింది.
అయితే ఈమూవీ వివాదంలో చిక్కుకుంది. ఎల్ఐసీ అనే టైటిల్ ను పెట్టడంపై లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కోర్టుకెక్కింది. దానికి తోడు రెమ్యునరేషన్ విషయంలో కూడా నిర్మాతతో నయనతారకు విబేధాలు వచ్చాయట. దాంతో ఈసినిమా నుంచి తప్పుకోవడమే మేలు అనుకుందట నయన్. అందుకే ఈమూవీకి రామ్ రామ్ చెప్పినట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
అయితే ఈ విషయపై అధికారికంగా మాత్రం క్లారిటీ రావల్సి ఉంది. కాని కోలీవుడ్ టాక్ మాత్రం ఆమె ఈసినిమా నుంచి తప్పుకున్నట్టే అంటున్నారు. ఈ విషయంలో ఈసినిమా డైరెక్టర్.. నయనతార భర్త విఘ్నేష్ శివన్ కూడా లేడీ సూపర స్టార్ ను ఏమాత్రం కన్విన్స్ చేయలేకపోయాడని టాక్. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.
Nayanthara
మరోవైపు వయస్సు పెరుగుతున్నా నయనతార యంగ్ లుక్ లో కనిపిస్తూ ఆఫర్లను సొంతం చేసుకుంటూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. నయన్ తాజాగా నటించిన అన్నపూరణి సినిమా సైతం కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా వల్ల మనోభావాలు దెబ్బ తిని ఉంటే తనను క్షమించాలని నయనతార సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు.
మరోవైపు వయస్సు పెరుగుతున్నా నయనతార యంగ్ లుక్ లో కనిపిస్తూ ఆఫర్లను సొంతం చేసుకుంటూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. నయన్ తాజాగా నటించిన అన్నపూరణి సినిమా సైతం కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా వల్ల మనోభావాలు దెబ్బ తిని ఉంటే తనను క్షమించాలని నయనతార సోషల్ మీడియా వేదికగా ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు.