అలనాటి నటి, తెలుగు తొలి సినిమా నటీమణి సురభి కమలాబాయి (Surabhi Kamalabai) తెలుగు ప్రేక్షకులకు సీత పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. 1932లో వచ్చిన ‘రామ పాదుక పట్టాభిషేకం’ చిత్రంలో సీతాదేవిగా జీవించి ప్రేక్షకులను మెప్పించారు. యడవల్లి సూర్యనారాయణ రాముడిగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు తొలి సీతారాములుగా గుర్తింపు దక్కించుకున్నారు.