హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 9న మహాబలిపురంలో అత్యంత సన్నిహితులు, చిత్ర ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వివాహం అనంతరం తిరుమల సందర్శించి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
ఈ క్రేజీ కఫుల్ లాంగ్ హనీమూన్ ట్రిప్ కి కూడా వెళ్లారు. వారాల పాటు తమకు ఇష్టమైన ప్రదేశాల్లో ఏకాంతంగా గడిపారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన నయనతార ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఆమె అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది.
లేడీ తలైవా నయనతార (Nayanthara), ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Sivan) ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ స్టార్ కపుల్ గా మారబోతున్నారు. గతంలోనే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట నెల రోజులుగా వివాహా వేడుక పనుల్లో బిజీగా ఉన్నారు.
నయనతారకు(Nayanathara) వాంతులు అయ్యాయట. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారట. నయనతారకు వివాహం జరిగి రెండు నెలలు దాటిపోగా ఆమె గర్భం దాల్చి ఉంటారని, అందుకే వాంతులు అయ్యాయని కొందరు భావిస్తున్నారు. ఇదే పతాక శీర్షికలకు ఎక్కింది. త్వరలో ఆమె బుల్లి సూపర్ స్టార్ కి జన్మనివ్వడం ఖాయం అంటున్నారు.
అయితే ఈ వాదన మరికొందరు కొట్టిపారేస్తున్నారు. అజీర్తి కారణంగానే ఆమెకు వాంతులు అయ్యాయి అంటున్నారు. మరొక వాదన ఏమిటంటే... స్కిన్ సమస్యతో బాధపడుతున్న నయనతార అస్వస్థతకు గురయ్యారు అంటున్నారు. అసలు విషయం ఏమిటనేది స్పష్టం కాలేదు. కొంత సేపు నయనతారను పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపారట వైద్యులు.
మరోవైపు నయనతార-విగ్నేష్ శివన్ ల లవ్ జర్నీ, వివాహ వేడుకను దర్శకుడు గౌతమ్ మీనన్ డాక్యూమెంటరీగా తెరకెక్కించాడు. నెట్ఫ్లిక్స్ లో ఎక్స్ క్లూజివ్ గా త్వరలో ఈ డాక్యూమెంటరీ ప్రసారం కానుంది. ఈ డాక్యూమెంటరీ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
నయనతార, విగ్నేష్ వివాహ వేడుక ఫోటోలు కొన్ని బయటికి రాగా నెట్ఫ్లిక్స్ యాజమాన్యం సీరియస్ అయ్యారు. ఇది అగ్రిమెంట్ బ్రేక్ చేయడమే అంటూ నయనతార దంపతులపై లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలా గోలా ఆ వివాదం నుండి నయనతార దంపతులు బయటపడ్డారు.
2015లో విడుదలైన నానుమ్ రౌడీదాన్ షూటింగ్ సమయంలో నయనతార, విగ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. ఆ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్ కావడంతో వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. గత ఏడేళ్లుగా ఈ జంట రిలేషన్షిప్ లో ఉన్నారు. ఎట్టకేలకు ఈ ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు.