ఈ క్రమంలోనే నవంబరు 2న జాకోబ్, ఆయన స్నేహితురాలు ఉంటున్న భవనం వద్దకు వెళ్లి ఆ ఇంటికి నిప్పంటించింది. దీన్ని గమనించిన స్థానికులు వారిని అప్రమత్తం చేశారు. అయితే అప్పటికే మంటల్లో చిక్కుకుని వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా అలియా ఫక్రీని అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె దోషిగా తేలితే జీవితఖైదు పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆమెను రిమాండ్కు తరలించారు. తదుపరి విచారణను డిసెంబరు 9వ తేదీకి వాయిదా వేశారు.