'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు తీసుకున్నాడు. ప్రకాష్ రాజ్ పై విజయం సాధించిన విష్ణు 'మా'కి కొత్త ప్రెసిడెంట్ గా అవతరించిన సంగతి తెలిసిందే. వివాదాలు, వాదనలు, పరస్పర ఆరోపణల తర్వాత అక్టోబర్ 10న ఉద్రిక్తకర పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో విష్ణు ప్యానల్ విజయం సాధించింది. గట్టి ప్రయత్నం చేసినప్పటికీ ప్రకాష్ రాజ్ కు ఓటమి తప్పలేదు.