పవిత్ర లోకేష్‌తో పిల్లలు కనడంపై స్పందించిన నరేష్‌.. ఫిజికల్‌గా మేం సిద్దమే, కానీ అంటూ..

First Published May 30, 2023, 2:33 PM IST

టాలీవుడ్‌లో బోల్డ్ కపుల్‌గా నిలుస్తున్న నరేష్‌-పవిత్ర అంతే బోల్డ్ గా తమ రిలేషన్‌ షిప్‌ గురించి చెబుతున్నారు. ఏకంగా తాము ఎందుకు కలవాల్సి వచ్చిందో, ఎందుకు దగ్గరయ్యామో అనేది కూడా `మళ్ళీ పెళ్ళి` సినిమాలో చూపించారు. తాజాగా పిల్లలు కనడంపై రియాక్ట్ అయ్యాడు నరేష్‌.

Pavitra Lokesh Naresh

సీనియర్‌ నటులు నరేష్‌, పవిత్ర లోకేష్‌ వ్యవహారం సర్వత్రా హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇటీవల ఈ ఇద్దరు ఏకంగా `మళ్ళీ పెళ్ళి` అంటూ తమ రిలేషన్‌షిప్‌నే బహిర్గతం చేశారు. ఇది మరింతగా చర్చనీయాంశం అయ్యింది. తాజాగా మరో క్రేజ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు నరేష్‌. మీడియా సంస్థతో మాట్లాడుతూ పిల్లలు కనడానికి సంబంధించి ఓపెన్‌ అయ్యారు. తాము సిద్ధమే అంటూ షాకిచ్చారు. 

Naresh - Pavitra Lokesh

టాలీవుడ్‌లో బోల్డ్ కపుల్‌గా నిలుస్తున్న నరేష్‌-పవిత్ర అంతే బోల్డ్ గా తమ రిలేషన్‌ షిప్‌ గురించి చెబుతున్నారు. ఏకంగా తాము ఎందుకు కలవాల్సి వచ్చిందో, ఎందుకు దగ్గరయ్యామో అనేది కూడా `మళ్ళీ పెళ్ళి` సినిమాలో చూపించారు. తాజాగా పిల్లలు కనడంపై రియాక్ట్ అయ్యాడు నరేష్‌. తాను, పవిత్ర పిల్లలు కనేందుకు మెడికల్‌గా, ఫిజికల్‌గా ఫిట్‌గానే ఉన్నామని తెలిపారు. ఇప్పటికీ తాము పిల్లలను కనొచ్చు అని, అయితే ఇప్పుడు పిల్లలను కంటే తనకు 80ఏళ్లు వచ్చేసరికి తమకు పుట్టబోయే బిడ్డకి 20ఏళ్లు వస్తాయని, అలా అవసరమా మాకు అని తెలిపారు. 
 

భార్యాభర్తలుగా మేం కలిసి ఉండటమే ఇప్పుడు ముఖ్యమని తెలిపారు. పవిత్ర పిల్లలు, తన పిల్లలు ఇద్దరూ తమ బిడ్డలే అని, మాకు ఇప్పుడు ఐదుగురు పిల్లలు ఉన్నారనుకుని బతుకుతున్నామని తెలిపారు నరేష్‌. పవిత్ర లోకేష్‌కి తన భర్తతో ఇద్దరు పిల్లలు జన్మించారు. మరోవైపు నరేష్‌కి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. నవీన్‌ విజయ్‌ కృష్ణ హీరోగా కొన్ని సినిమాలు చేసిన విషయం తెలిసిందే. 

pavitra lokesh

ఇక తమ రిలేషన్‌షిప్‌ గురించి, నరేష్‌ మూడో భార్య రమ్యరఘుపతి గురించి తెలియజేసేలా, పవిత్ర, తాను ఒక్కటి కావడానికి కారణాలు తెలిసేలా `మళ్ళీ పెళ్ళి` సినిమా చేశారు. ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. సుమారు 15కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కనీసం కోటీ రూపాయలు కూడా వసూలు చేయలేదు. ఇటు తెలుగులో, అటు కన్నడలోనూ ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇందులో నరేష్‌.. తన పాయింట్‌ ఆఫ్‌ వ్యూలోనే ఈ సినిమాని తీసినట్టుగా ఉంది. రమ్యరఘుపతిని విలన్‌గా చూపించే ప్రయత్నం జరిగిందనే టాక్‌ వచ్చింది. సినిమా సైతం అలానే ఉంది. అందుకే ఆడియెన్స్ ఈసినిమాని పట్టించుకోలేదు. 
 

Actor Naresh and actress Pavitra lokesh

ఇక నరేష్‌, పవిత్ర ప్రస్తుతం కలిసే ఉంటున్నారు. వీరిద్దరు ప్రేమ సహజీవనం వరకు వచ్చింది. ఇటు నరేష్‌, అటు పవిత్రలకు గత పెళ్లిళ్లకి సంబంధించి భాగస్వాముల నుంచి విడాకుల క్లీయరెన్స్ లు రావాల్సి ఉంది. అనంతరం ఈ ఇద్దరు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఇక నటుడిగా నరేష్‌ బిజీగా ఉన్నారు. పవిత్ర సైతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

click me!