డైలాగులు విషయానికి వస్తే.. పొలిటికల్ సెటైర్లు ఉన్నా ఎక్కువ శాతం .. సెన్సార్ బీప్ల్లో కలిసిపోయాయి. ఇక ‘పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయ్.. మనల్ని ఎవడేం చేస్తాడు’, ఇక ‘నాన్నగారు చనిపోయి రోజులు కూడా కాలేదు.. అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టేశారా?’, ‘సంక్షేమ పథకాల పేరుతో అన్ని బిస్కెట్లు వేసేశాం.. ఇంకా చెప్పడానికి వాళ్లు వినడానికి మిగిలిందేం లేదు’, ‘దేశాన్ని కాపాడటానికి సైనికుడు, కడుపు నింపడానికి రైతు ఎంత ముఖ్యమో, సమాజానికి జర్నలిస్ట్ కూడా అంతే ముఖ్యం’వంటి డైలాగులకు జనం బాగానే రెస్పాండ్ అయ్యారు.