వీర్లపల్లికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలతో ఈ చిత్ర కథ మొదలవుతుంది. స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపాన నిషేధం మూమెంట్ మొదలవుతుంది. దీనితో వీర్లపల్లిలో సిల్క్ బార్ విషయంలో ఆసక్తికర పరిణామాలు ఏర్పడతాయి. ధరణి పాత్రలో నాని, కీర్తి సురేష్, సూరి ఒక గ్రూప్ గా ఉంటారు. కొన్ని సన్నివేశాల తర్వాత వచ్చే ధూమ్ ధామ్ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కీర్తి సురేష్, నాని మాస్ స్టెప్పులతో అలరించారు.