కేసులు పెట్టడం ఇప్పుడు చాలా తేలిక.. వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో బాలయ్య హాట్ కామెంట్స్

First Published Jan 22, 2023, 11:00 PM IST

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. 

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.  బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. గోపీచంద్ బాలయ్యని ఫ్యాన్స్ కోరుకునే విధంగా పర్ఫెక్ట్ మాస్ అవతారంలో ప్రజెంట్ చేశారు. 

ఇప్పటికి ఈ చిత్రం సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దీనితో చిత్ర యూనిట్ నేడు జెఆర్సీ కన్వెన్షన్ లో వీరసింహుని విజయోత్సవం పేరుతో సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నారు. ఫ్యాన్స్ హంగామాతో సక్సెస్ సెలబ్రేషన్ వేడుక జోరుగా సాగుతోంది. 

విజయోత్సవ వేడుకలో బాలయ్య ప్రసంగం ఆకట్టుకుంది. బాలకృష్ణ తనదైన శైలిలో ఒక ఫ్లోలో తన మాటలతో, పద్యాలతో అలరించారు. వీరసింహారెడ్డి చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. దర్శకుడు గోపీచంద్ మలినేని పనితీరుని అభినందించారు. అలాగే సాయిమాధవ్ బుర్రా, తమన్, రామజోగయ్య శాస్త్రి లపై ప్రశంసలు కురిపించారు. 

దర్శకుడి గురించి మాట్లాడుతూ బాలయ్య పరోక్షంగా ఓ హాట్ కామెంట్ చేసారు. ఏం జరిగినా కేసు బుక్ చేస్తున్నారు. ఇప్పుడు కేసులు పెట్టడం చాలా తేలిక కదా అంటూ బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించినవే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేసుల గురించి మాట్లాడుతూ.. ఆ వాటి గురించి ఇప్పుడు ఎందుకు కానీ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. 

విజయోత్సవ వేడుకకి వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ తో  పాటు హను రాఘవపూడి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి. సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ అతిథులుగా హాజరయ్యారు. అలాగే చిత్ర నిర్మాతలని కూడా బాలయ్య ప్రశంసించారు. మైత్రి నిర్మాతలు పోటీ పడి చిత్రాలు చేస్తున్నారు. పోటీ ఉంటేనే మనం అంటే ఏంటో తెలుస్తుంది అని బాలయ్య అన్నారు. 

click me!