ఆ సమయంలో లారీ డ్రైవర్, నారీ నారీ నడుమ మురారి లాంటి చిత్రాలు చేస్తున్నాను. కానీ ప్రేక్షకులకు కొత్తదనం అందించాలని కోరుకున్నట్లు బాలయ్య తెలిపారు. అప్పుడే తన వద్దకి ఆదిత్య 369 చిత్రం నా దగ్గరకి వచ్చింది. సింగీతం శ్రీనివాసరావుపై నమ్మకంతో ఈ చిత్రం చేసినట్లు బాలయ్య తెలిపారు. ఎందుకంటే ఇది తొలి టైం ట్రావెల్ మూవీ. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వెన్నెముకగా నిలిచారు. నాన్నగారి సినిమాలు చూశాను. కాబట్టి శ్రీకృష్ణ దేవరాయలు పాత్ర నాకు కొట్టిన పిండి అనిపించింది.