చిత్రం కథ ఏంటి
సివిల్ ఇంజీనీర్ సీతారం(బాలయ్య)..చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుని పోతూంటాడు. ఎన్నో గ్రామాలకు అతను దేవుడుగా మారతాడు. అలాంటి సీతారాం జీవితంలో జరిగిన ఓ సంఘటనతో డాకూ మహారాజ్ గా టర్న్ అవుతాడు. జీపు దిగి గుర్రం ఎక్కి డాకూగా తిరుగుతూంటాడు. ఆ పరిస్దితులు ఏమిటి, అతనికి చిన్న పాప వైష్ణవికి ఉన్న కనెక్షన్ ఏమిటి, ఆమెను రక్షించాలనుకోవటానికి కారణం ఏమిటి, ప్రశాంతంగా సాగిపోతున్న అతని జీవితాన్ని సమూలంగా మార్చిన సంఘటన ఏమిటి వంటి విషయాలుకు సమాధానమే ఈ సినిమా కథ.