Nagarjuna: కాలు విరిగినా షూటింగ్‌ చేసిన నాగార్జున, సెట్‌లో తీవ్ర అవమానం.. రియాలిటీ చూపించిన దర్శకుడు

Published : Aug 29, 2026, 02:35 PM IST

కాలు విరిగినా కూడా షూటింగ్‌లో పాల్గొన్నాడు నాగార్జున. అంతేకాదు హీరోయిన్‌ కి కూడా కాలు ఫ్రాక్చర్‌ అయ్యిందట. ఆ సమయంలో సెట్‌లో నాగ్‌ని చూసి అంతా నవ్వారట. దీంతో నాగార్జునని రియాలిటీ చూపించారట.

PREV
14
నాగార్జున 67వ బర్త్ డే

కింగ్‌ నాగార్జున నేడు తన 67వ పుట్టిన రోజుని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న `కింగ్‌ 100` మూవీ టీజర్‌ని విడుదల చేశారు. దీనికి `కింగ్‌ 100` టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన టీజర్‌ ఆకట్టుకుంటోంది. నాగార్జున ఇందులో బికారీ నుంచి కరోడ్‌పతిగా ఎదుగుతాడు. తాను పడ్డ అవమానాలను, తాను ఎదిగిన తీరుని ఈ మూవీని చూపించబోతున్నట్టు టీజర్‌లో ఆవిష్కరించారు. ఏదేమైనా డబ్బు కంటే పవర్‌ చాలా ముఖ్యమని, ఆ గుర్తింపు చాలా కీలకమని దానికోసమే నిత్యం పరిగెడుతూనే ఉన్నట్టు చూపించారు. అదే సమయంలో ఓ స్కామ్‌ గురించి చూపించబోతున్నట్టు సమాచారం.

24
విక్రమ్‌ మూవీతో హీరోగా పరిచయం అయిన నాగార్జున

ఇదిలా ఉంటే నాగార్జున బర్త్ డే వేళ ఆయనకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తన కెరీర్‌ ప్రారంభంలో జరిగిన ఒక సంఘటన బయటకు వచ్చింది. దర్శకుడు గీతాకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. నాగార్జున 1986లో హీరోగా పరిచయం అయ్యారు. `విక్రమ్‌` అనే చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ప్రారంభంలో నాగార్జున నటనకు సంబంధించిన చాలా అవమానాలు ఫేస్‌ చేశారు. నటుడిగా సెట్‌ కాదన్నారు. అప్పట్లోనే ట్రోల్స్ కి గురయ్యాడు. `శివ` వరకు నాగార్జునకి హిట్‌ లేదు.

34
కాలు విరిగినా షూటింగ్‌లో నాగార్జున

కానీ మధ్యలో కొన్ని మంచి సినిమాలు చేశారు. మంచి క్లాసికల్స్ చేశారు. అందులో `గీతాంజలి`, `సంకీర్తన` చిత్రాలున్నాయి. ఇందులో `సంకీర్తన` మంచి క్లాసికల్‌ హిట్‌. మ్యూజిక్‌ పరంగా బాగా ఆకట్టుకుంది. దీనికి దర్శకుడు గీతాకృష్ణ. ఇందులో రమ్యకృష్ణ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నాగార్జున కాలు ఇరిగిందట. వేరే సినిమా షూటింగ్‌లో ఆయన కాలు విరిగిందట. కాలుకు పట్టి వేసుకొనే `సంకీర్తన` షూటింగ్‌లో పాల్గొన్నాడట. అదే సమయంలో రమ్యకృష్ణకి కూడా గాయమైందట. ఆమె ఓ ఈవెంట్‌లో స్టేజ్‌ నుంచి కింద పడి కాలు విరిగిందట. దీంతో అటు నాగ్‌, ఇటు రమ్యకృష్ణ కాలు గాయాలతోనే `సంకీర్తన` చిత్రీకరణలో పాల్గొనాల్సి వచ్చిందట. గోదావరి వెంట ఇసుకలో నడిచే సమయంలో ఇద్దరూ ఇబ్బంది పడ్డారని, కానీ అది తెలియకుండా తాను షూటింగ్‌ చేసినట్టు చెప్పాడు గీతాకృష్ణ.

44
నాగార్జునకి అవమానం .. రియాలిటీలోకి తీసుకొచ్చిన దర్శకుడు

అయితే ఓ పాట పర్వతం ప్రాంతంలో చిత్రీకరణ జరిపారట. నాగార్జున కాలు మడతగా వేసే సన్నివేశం ఉంది. అందులో ఆయన తూలినట్టు వేశారట. దీంతో సెట్‌లో ఉన్న వారంతా గొళ్లున నవ్వారట. షూటింగ్‌ చూడ్డానికి వచ్చినవారు, సెట్‌లో ఉన్న సిబ్బందితోపాటు అంతా నవ్వారట. ఇలా రెండు మూడు సార్లు జరిగిందట. దీంతో చాలా అవమానంగా ఫీలయ్యారట నాగార్జున. ఆ తర్వాత గోదావరిలో ప్రయాణిస్తున్న సమయంలో నాగార్జున ఇబ్బంది పడ్డాడట. పడవలో సినిమా కార్మికులతో కలిసి నాగార్జున కూడా ఎక్కాల్సి వచ్చిందట. తాను వాళ్లతో కలిసి ఈ చిన్న పడవలో ప్రయాణించడమేంటి? అనుకున్నాడట. కానీ అక్కడే ఒక వ్యక్తి ఉండి, ఎవరితను తెగ ఇబ్బంది పడుతున్నాడని కామెంట్‌ చేశాడట. అంతేకాదు నార్మల్‌ వ్యక్తిగానే ట్రీట్‌ చేశాడట. ఆ తర్వాత పక్కనే ఉన్న కెమెరామెన్‌.. చూశావా అది నీ స్థాయి. నువ్వు ఎవరనేది ఇక్కడ ఎవరికీ తెలియదు, కాబట్టి ఇబ్బంది పడాల్సిన పనిలేదని చెప్పాడట. అప్పటి వరకు తాను పెద్ద స్టార్‌ కొడుకుని అనే ఊహలో ఉన్న నాగార్జునని రియాలిటీలోకి తీసుకొచ్చారట దర్శకుడు గీతాకృష్ణ. తాజాగా ఏసియానెట్‌తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు దర్శకుడు. ప్రస్తుతం ఆయన కామెంట్‌ వైరల్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories