Tollywood: మీడియం రేంజ్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు.. వీటికి ఈ ఏడాది కూడా మోక్షం లేదా ?

Published : Jul 29, 2026, 12:36 PM IST

టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. పలు మార్లు రిలీజ్ డేట్లు వాయిదా పడుతున్నాయి. నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలు నటించిన ఆ చిత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
భారీ బడ్జెట్ సినిమాలు ఆలస్యం

పాన్ ఇండియా సినిమాల హవా పెరిగిన తర్వాత టాలీవుడ్ సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోయింది. మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా వందల కోట్ల బడ్జెట్ వెచ్చిస్తున్నారు. టాలీవుడ్ లో చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న సినిమాలు ఇప్పటికీ విడుదలకు నోచుకోవడం లేదు. మీడియం రేంజ్ హీరోలు నటిస్తున్న చిత్రాలు అవి. నిఖిల్, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఆ చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

25
స్వయంభు

హీరో నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా గుర్తింపు పొందారు. నిఖిల్ చిత్రాలు సాధారణంగా మీడియం బడ్జెట్ లలో తెరకెక్కుతుంటాయి. కానీ నిఖిల్ నటిస్తున్న పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామా స్వయంభు చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. పలుమార్లు ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ పోస్ట్ పోన్ అయింది. ఓ సందర్భంలో నిఖిల్ మాట్లాడుతూ.. ఈ మూవీలో హై క్వాలిటీ విజువల్స్ కోసం సమయం పడుతోంది అని తెలిపారు. అయితే ఈ చిత్ర ఓటీటీ డీల్ విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకుడు. నభ నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఈ ఏడాదైనా ఈ చిత్రం రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

35
సంబరాల ఏటి గట్టు

సాయిధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రంతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం తేజు నటిస్తున్న చిత్రం సంబరాల ఏటి గట్టు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కెపి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రెండేళ్లుగా ఈ చిత్రంలో నిర్మాణంలో ఉన్నప్పటికీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ చిత్రానికి బడ్జెట్ సమస్యలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఐశ్వర్య లక్ష్మి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్మాతలు. పలు మార్లు వాయిదా పడ్డ ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

45
వృషకర్మ

నాగ చైతన్య నటిస్తున్న మిస్టీరియస్ థ్రిల్లర్ చిత్రాన్ని విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నారు. తండేల్ పూర్తి కాగానే నాగ చైతన్య ఈ మూవీ మొదలు పెట్టారు. కానీ ఇప్పటికీ రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే రావలసిన ఈ చిత్రం వాయిదా పడింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్.

55
విశ్వంభర

ఇది మీడియం రేంజ్ హీరో సినిమా కాదు. మెగాస్టార్ సినిమా. చాలా కాలంగా ఈ చిత్రం వాయిదా పడుతూ మెగా అభిమానులని కలవరపెడుతోంది. సీజీ, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ తీవ్రంగా ఆలస్యం అవుతున్నట్లు టాక్. ఈ మూవీ గురించి చిత్ర యూనిట్ కి సంబంధించిన ఎవ్వరూ మాట్లాడడం లేదు. దీనితో అసలు విశ్వంభర ఈ ఏడాది అయినా వస్తుందా రాదా అనే అనుమానాలు మొదలయ్యాయి. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories