Naga Chaitanya: నాగ చైతన్య మనసుని బాధ పెట్టిన సంఘటన.. అప్పుడే ఆ నిర్ణయం..

First Published Aug 13, 2022, 3:03 PM IST

అక్కినేని నాగ చైతన్య మరోసారి 'లాల్ సింగ్ చడ్డా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొన్ని వారాల క్రితం చైతు 'థాంక్యూ' చిత్రం విడుదలైంది. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.

అక్కినేని నాగ చైతన్య మరోసారి 'లాల్ సింగ్ చడ్డా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొన్ని వారాల క్రితం చైతు 'థాంక్యూ' చిత్రం విడుదలైంది. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. గురువారం విడుదలైన లాల్ సింగ్ చడ్డా చిత్రం దేశ వ్యాప్తంగా అమీర్ ఖాన్ అభిమానులని తీవ్రంగా నిరాశ పరుస్తోంది. 

నాగ చైతన్య ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. చైతు నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో నాగ చైతన్య తన కెరీర్ లో జరిగిన కీలక అంశాన్ని బయట పెట్టాడు. ఆ సంఘటన నాగ చైతన్య మనసుని ఎంతగానో బాధించింది అట. 

అక్కినేని వారసుడిగా నాగ చైతన్య 2009లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. జోష్ చిత్రంతో నాగ చైతన్య హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. సినిమా రిలీజ్ డే రోజు ప్రేక్షకుల స్పందన చూద్దాం అని నాగ చైతన్య థియేటర్ కి వెళ్ళాడట. 

Naga Chaitanya

ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉందని అనుకున్నాడట. కానీ ఇంటర్వెల్ నుంచి ప్రేక్షకులు థియేటర్ నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారట. అది చూసి తన మనసుకి చాలా బాధ కలిగిందని చైతు తెలిపాడు. అప్పటి నుంచి థియేటర్ కి వెళ్లి సినిమా చూడకూడదు అని నిర్ణయించుకున్నాడట. 

ఆరోజు జరిగిన సంఘటన తన మనసులో నుంచి ఇంకా పోలేదని నాగ చైతన్య తెలిపాడు. ఇక లాల్ సింగ్ చడ్డా విషయానికి వస్తే చైతు ఇందులో బాలరాజు పాత్రలో నటించాడు. ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ చిత్రానికి ఇది రీమేక్. 

ఇండియన్ ఆడియన్స్ ని ఈ చిత్రం ఏమాత్రం మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ నంబర్స్ కూడా దారుణంగా నమోదవుతున్నాయి. త్వరలో నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నాడు. అలాగే పరశురామ్ తో కూడా ఓ చిత్రం చేయాల్సి ఉంది. 

click me!