సమంత, చైతూల లవ్‌స్టోరి ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా? చూపులు కలిసింది అక్కడే.. ఆసక్తి రేపుతున్న ఫస్ట్ క్రష్‌

First Published Oct 2, 2021, 7:29 PM IST

నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేండ్లలోనే విడాకులు తీసుకుంది. ఈగోలు, కెరీర్‌, ఫ్యామిలీ ఒత్తిడి వంటి వాటి మధ్య నలిగిపోయి ఇక కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నారని టాక్‌. తాజాగా సమంత తమ లవ్‌ స్టోరీ గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 
 

నాగచైతన్య, సమంత కలిసి మొదట `ఏం మాయ చేసావె` చిత్రంలో నటించారు. సమంతకిది డెబ్యూ మూవీ కాగా, చైతూకిది రెండో సినిమా. తొలి చిత్రం `జోష్‌` అనే విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే చైతూ, సమంతల చూపులు కలిశాయని, చూపులు స్నేహానికి దారితీసి, అనంతరం ప్రేమగా మారి, ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం రెండేళ్ల పాటే రిలేషన్‌లో ఉండి ఎట్టకేలకు ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో 2017లో మ్యారేజ్‌ చేసుకున్నారు.

ప్రేమని పెద్ద సమక్షంలో అరెంజ్‌ మ్యారేజ్‌గా చేసుకుని బెస్ట్ కపుల్‌ అని నిరూపించుకున్నారు చై-సామ్‌ జోడి. కానీ కరెక్ట్ గా నాలుగేళ్లకే విడిపోయారు. మరో నాలుగు రోజుల్లో మ్యారేజ్‌ డే ఉన్న నేపథ్యంలో గాంధీ జయంతిని విడాకుల ప్రకటనకు వేదికగా మార్చుకున్నారు. చైతూ, సమంత పరస్పరం అంగీకారంతో, స్నేహా భావ హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. పదేళ్లస్నేహం మున్ముందు కూడా కొనసాగుతుందని వెల్లడించారు. 

అయితే ఈ సందర్భంగా వీరి లవ్‌ స్టోరి వైరల్‌ అవుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ ఎక్కడ పుట్టింది. ఎలా పుట్టిందనే విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తమ లవ్‌ స్టోరికి సంబంధించి సమంత చెప్పిన విషయాలు వైరల్‌ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో సమంత ఈ విషయాన్ని వెల్లడించింది. 

`ఏం మాయ చేసావె` సినిమా లుక్‌ టెస్ట్ సమయంలో ఈ ఇద్దరు కలిశారట. మొదట సెలూన్‌లో వీరి పరిచయం జరిగిందని చెప్పింది సమంత. సెలూన్‌లో రెడీ అవుతున్న సమయంలో చైతన్యని చూసి చిన్న కుర్రాడనుకుందట. ఫస్ట్ లుక్‌ కోసం రెడీ అవుతున్నప్పుడు తన వద్దకు వచ్చాడని, ఆ సమయంలో చైతన్య నర్వస్‌గా ఫీలవుతున్నాడట. ఆయనలో టెన్షన్‌ ఉన్నట్టు గమనించిందట. కానీ చాలా స్వీట్‌గా అనిపించాడని చెప్పింది సమంత. 

అతని నర్వస్‌ని చూసి తనే హాయ్‌ అని పలకరించిందట. అందుకు చై కూడా నర్వస్‌గానే హాయ్‌ అని చెప్పాడని తెలిపింది సమంత. ఫస్ట్ టైమ్‌ కలిసినప్పుడే తమలో ప్రేమ పుట్టలేదని, తమ లవ్‌ ఎట్‌ ఫస్ట్ సైట్‌ కాదని చెప్పింది. `ఏం మాయ చేసావె` పూర్తయ్యేలోపు తమ మనసులు కలిశాయని చెప్పింది. సుదీర్ఘంగా తమ లవ్‌ స్టోరీ సాగిందని వెల్లడించింది. చై దొరకడం అదృష్టమని చెప్పింది. 

Samantha Naga Chaitanya divorce

`ఏం మాయ చేసావె` చిత్రం తర్వాత సమంత, చైతూ కలిసి `ఆటోనగర్‌ సూర్య`, `మనం`, `మజిలి` చిత్రాల్లో నటించారు. ఇందులో `ఆటోనగర్‌ సూర్య` పరాజయం చెందగా, మిగిలిన అన్ని సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. అలాగే `ఓ బేబీ`లోనూ చైతూ గెస్ట్ రోల్‌ చేశారు. 

సమంత ప్రస్తుతం తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటించింది. ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. దీంతోపాటు తమిళంలో నయనతార, విజయ్‌ సేతుపతిలతో కలిసి `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నటించింది. నయన్‌ ప్రియుడు విఘ్నేష్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. 
 

మరోవైపు నాగచైతన్య ఇటీవల `లవ్‌ స్టోరి` చిత్రంలో విజయాన్ని అందుకున్నారు. దీంతోపాటు ప్రస్తుతం ఆయన విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో `థ్యాంక్యూ` చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హిందీలో ఆమిర్‌ ఖాన్‌తో కలిసి `లాల్‌ సింగ్‌ చద్దా` సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు చైతూ.

click me!