నాగచైతన్య తండ్రి నాగార్జునలాగానే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అంతేకాదు ఏకంగా తండ్రితో రొమాన్స్ చేసిన హీరోయిన్పైనే క్రష్ పెంచుకున్నారు. ఆ విషయాన్ని ఓపెన్గా చెప్పేశారు.
అక్కినేని హీరోలంటే రొమాన్స్ కి కేరాఫ్. మోస్ట్ రొమాంటిక్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు నుంచి ఇది ఉంది. ఆయన లవ్ స్టోరీస్తో మెప్పించారు. రొమాంటిక్ హీరోగా రాణించారు. ఓ సందర్భంలో హీరో సుమంత్ కూడా ఆయన గురించి కామెంట్ చేశారు. నాగ్ మామ కంటే తాతనే పెద్ద రొమాంటిక్ అన్నారు. ఇక నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకంగా మన్మథుడు అనే ట్యాగ్ని మెయింటేన్ చేస్తున్నారు. టాలీవుడ్లో హీరోయిన్లే కాదు, అమ్మాయిల గ్రీకు వీరుడిగానూ పేరుతెచ్చుకున్నారు. తండ్రి బాటలోనే కొడుకు చైతన్య కూడా వెళ్తున్నారు. రొమాంటిక్ హీరోగా రాణిస్తున్నారు.
25
శోభితాని రెండో పెళ్లి చేసుకున్న నాగచైతన్య
లవ్ స్టోరీస్తో ఆకట్టుకుంటున్నారు. ఆయన కెరీర్లో పెద్ద హిట్ చిత్రాలన్నీ లవ్ స్టోరీస్ కావడం విశేషం. `ఏం మాయ చేశావె`, `100% లవ్`, `మనం`, `ఒక లైలా కోసం`, `ప్రేమమ్`, `మజిలి`, `లవ్ స్టోరీ`, `తండేల్` వంటి మూవీస్ తో విజయాలు అందుకున్నారు. ఇవన్నీ ప్రేమ కథా చిత్రాలే కావడం విశేషం. సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ రెండు లవ్ స్టోరీలున్నాయి. సమంతతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లకి విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ శోభితాతో ప్రేమలో పడ్డారు. రెండో సారి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు శోభితాతో రొమాంటిక్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు.
35
నాగచైతన్య ఫస్ట్ సెలబ్రిటీ క్రష్
ఈ క్రమంలో నాగచైతన్యకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన తన ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరో బయటపెట్టారు. అయితే ఆమె నాగార్జునతో రొమాన్స్ చేసిన హీరోయిన్ కావడం విశేషం. నాగచైతన్య నాలుగేళ్ల క్రితం ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. తన ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరో వెల్లడించారు. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ అంటే క్రష్ అని తెలిపారు. ఆమె తన మొదటి సెలబ్రిటీ క్రష్ వెల్లడించారు.
సుస్మితా సేన్ తన క్రష్ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు, కానీ ఆమె తన తండ్రితో రొమాన్స్ చేసిన హీరోయిన్ కావడం విశేషం. నాగార్జున, సుస్మితా సేన్ కలిసి `రచ్చగన్`(రక్షకుడు) చిత్రంలో నటించారు. నాగార్జున కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రమిది. రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు ప్రవీణ్ గాంధీ దీన్ని రూపొందించారు. 1997లో విడుదలైన ఈ చిత్రం డీసెంట్గా ఆడింది. ఒకప్పుడు తండ్రితో రొమాన్స్ చేసిన హీరోయిన్పై కొడుకు నాగచైతన్యకి క్రష్ ఏర్పడటం విశేషమనే చెప్పాలి.
55
వృష కర్మ మూవీతో బిజీగా ఉన్న నాగచైతన్య
నాగచైతన్య చివరగా `తండేల్`తో విజయాన్ని అందుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆయనకు హిట్ పడింది. ఇది దాదాపు వంద కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో `వృషకర్మ` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.