కౌన్సిలింగ్ వరకు వెళ్లిన చైతు, సమంత డైవోర్స్ ? ఇద్దరి మధ్య చెడింది అక్కడేనా..

First Published Sep 9, 2021, 9:01 PM IST

సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా గుర్తింపు పొందారు అక్కినేని నాగచైతన్య, సమంత. ఇద్దరూ సినిమాల్లో రాణిస్తున్నారు. సమంత అయితే నటిగా సౌత్ లో సూపర్ పాపులారిటీ సొంతం చేసుకుంది.

సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా గుర్తింపు పొందారు అక్కినేని నాగచైతన్య, సమంత. ఇద్దరూ సినిమాల్లో రాణిస్తున్నారు. సమంత అయితే నటిగా సౌత్ లో సూపర్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇటీవల విడుదలైన ఫ్యామిలీ మ్యాన్ 2తో నేషనల్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. 

ఎవరూ ఊహించని కారణాలతో చై, సామ్ ఇద్దరూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరి బంధానికి బీటలు వాలినట్లు.. వీరిద్దరి తమ వైవాహిక జీవితానికి తెరదించబోతున్నట్లు అనేక వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చై, సామ్ మౌనంగా ఉండడం.. అక్కినేని కాంపౌండ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. 

చైతు, సమంత మధ్య విభేదాలు నిజమే అంటూ అందరిని షాక్ కి గురిచేసే విశ్వసనీయ వార్తలు బయటకు వస్తున్నాయి. సమంత ఒంటరిగా గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. కానీ నాగ చైతన్య ఎక్కడా కనిపించడం లేదు. చైతు, సమంత విడాకుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారనేది నిజమే అని అంటున్నారు. 

వీరిద్దరూ డివోర్స్ కి ప్రయత్నిస్తుండగా.. ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కౌన్సిలింగ్ కోసం ఇటీవల సమంత గోవా నుంచి హైదరాబాద్ కు వచ్చి వెళ్లిందట. 

సమంత, చైతు మధ్య అసలు విభేదాలు ఎందుకు తలెత్తాయి అనే విషయంలో స్పష్టమైన సమాచారం లేదు. కానీ అందుతున్న సమాచారం మేరకు సమంత విషయంలో చైతు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సమంత ఫ్యామిలీ కంటే సినిమాలు, ఇతర అంశాలకే ప్రాధాన్యత ఇస్తోందట. 

సమంత ఫ్యామిలీ లైఫ్ కి పరిమితం కావాలని అక్కినేని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కానీ అందుకు సమంత అంగీకరించడం లేదట. ఇక్కడే విభేదాలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి ఎంతో ప్రయత్నించారట. కానీ ఆ పయత్నాలు వర్కౌట్ కాలేదు. 

2017లో చై సామ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్లపాటు ఈ జంట అన్యోన్యంగా జీవించారు. కానీ ఊహించని విధంగా ఇలా విభేదాలు తలెత్తడంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. 

click me!