గొడవ తర్వాత ప్రభాస్ తో మాట్లాడలేదు.. మళ్ళీ నటించాలని ఉంది, పూరి టచ్ లో.. కంగనా కామెంట్స్

First Published Sep 9, 2021, 7:25 PM IST

నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. 

నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. 

ప్రస్తుతం కంగనా నటించిన పాన్ ఇండియా చిత్రం 'తలైవి'. నటి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ చిత్రం రేపు అంటే సెప్టెంబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 

ఈ సందర్భంగా కంగనా రనౌత్ మీడియాతో ఇంటరాక్ట్ అయింది. అనేక విషయాలు ప్రస్తావిస్తూ ప్రభాస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది కంగనా. గతంలో ప్రభాస్ తో కలసి నటించారు కదా అని మీడియా ప్రశ్నించగా కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

తనకు మరోసారి ప్రభాస్ తో కలసి నటించాలని ఉందని మనసులో మాట బయట పెట్టింది కంగనా. తాను రెగ్యులర్ గా పూరి జగన్నాథ్ తో టచ్ లో ఉంటున్నానని తెలిపింది. ప్రభాస్ అవకాశం ఇస్తే మరోసారి నటిస్తానని పేర్కొంది. 

2009లో ప్రభాస్, కంగనా పూరి దర్శకత్వంలో ఏక్ నిరంజన్ చిత్రంలో నటించారు. ఏక్ నిరంజన్ షూటింగ్ టైంలో తాను, ప్రభాస్ నిత్యం గొడవ పడేవాళ్ళం అని కంగనా తెలిపింది. ఒకరోజు పెద్ద గొడవ జరిగింది. దీనితో కొన్ని రోజులు నేను ప్రభాస్ తో మాట్లాడలేదు అని కంగనా అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది. 

బాహుబలి చూశాక గర్వంగా అనిపించింది. ప్రభాస్ ఈ స్థాయికి చేరుకోవడంతో సంతోషించాను అని కంగనా తెలిపింది. తలైవి చిత్రం ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కింది. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. 

click me!