Niharika: మైండ్ లో ఒకడు బెడ్ పై మరొకడు... నిహారిక పై దారుణమైన ట్రోలింగ్!

Published : May 11, 2023, 11:02 AM ISTUpdated : May 11, 2023, 11:13 AM IST

నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఆమె ఓ వెబ్ సిరీస్లో నటించారు. ఈ సిరీస్ ట్రైలర్ విడుదల కాగా నిహారిక చెప్పిన డైలాగ్ ట్రోల్ కి గురవుతుంది. 

PREV
17
Niharika: మైండ్ లో ఒకడు బెడ్ పై మరొకడు... నిహారిక పై దారుణమైన ట్రోలింగ్!
Niharika Konidela


మెగా డాటర్ నిహారిక నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో నిహారిక ఓ వెబ్ సిరీస్ చేశారు. హాట్ స్టార్ లో మే 19 నుండి ఇది స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. డెడ్ పిక్సెల్స్ సిరీస్ ఓ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కింది. ఆన్లైన్ గేమ్స్ యూత్ ని ఊపేస్తున్నాయి. ఈ గేమ్ పార్టనర్స్ లైఫ్ పార్టనర్స్ గా కూడా మారిపోతున్నారు. ఆ కాన్సెప్ట్ తో డెడ్ పిక్సెల్స్ తెరకెక్కింది. 
 

27
niharika konidela

నిహారిక ఈ సిరీస్లో గాయత్రి అనే రోల్ చేశారు. తనతో పాటు ఆన్లైన్ గేమ్ ఆడే పాత్రల్లో అక్షయ్ లాగుసాని, వైవా హర్ష నటించారు. ఇద్దరి వ్యక్తులను ఇష్టపడే అమ్మాయిగా నిహారిక క్యారెక్టర్ చూపించారు. కాగా ట్రైలర్ లో నిహారిక ఓ డైలాగ్ చెప్పారు. 'రోషన్ ఇన్ బెడ్... భార్గవ్ ఇన్ మైండ్' అని నిహారిక చెప్పిన బోల్డ్ డైలాగ్ వైరల్ అవుతుంది.

37
niharika konidela

అదే సమయంలో నిహారికను ట్రోల్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ సైతం ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు నటిగా చేయడమే ఇష్టం లేని మెగా అభిమానులు నిహారిక బోల్డ్ రోల్స్ చేయడాన్ని అసలు సహించలేకపోతున్నారు. డెడ్ ఫిక్సెల్స్ సిరీస్ పై ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఆదిత్య మందల ఈ సిరీస్ తెరకెక్కించారు. 
 

47

మరోవైపు నిహారిక కొణిదెల విడాకుల వార్తలు దుమారం రేపుతున్నాయి. మార్చి నెలలో నిహారిక భర్త వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు.  నిహారిక-వెంకట చైతన్య విడాకులు ఖాయమేనని చిత్ర వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. 

57

నిహారిక విడాకుల పుకార్లపై నాగబాబు సైతం మాట్లాడలేదు. ఆయన మౌనం వహించారు. సాధారణంగా తన కుటుంబ సభ్యుల మీద వచ్చే ఆరోపణలను నాగబాబు సహించరు. వెంటనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కూతురు లైఫ్ మేటర్ లో మాత్రం నాగబాబు సైలెంట్ గా ఉండిపోయారు.

67


అలాగే నిహారిక ఈ మధ్య కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేశారు. నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆమె పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బ్యానర్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తున్నారు. తన నిర్మాణ సంస్థను ఆమె మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఇందు కోసం ఓ ఆఫీస్ ఓపెన్ చేశారు. 
 

77

తన ప్రొడక్షన్ కంపెనీ కొత్త ఆఫీస్ కి సంబంధించిన ఫోటోలు నిహారిక ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు. ఇక నిహారిక ప్రయత్నం సక్సెస్ కావాలని. తన బ్యానర్లో హిట్ చిత్రాలు తెరకెక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిహారిక కొత్త ఆఫీస్ ఓపెనింగ్ కి కూడా వెంకట చైతన్య హాజరు కాలేదు.  ఈ క్రమంలో కొన్ని అనుమానాలు తెరపైకి వచ్చాయి. భర్తతో విడిపోయిన నిహారిక కెరీర్ మీద ఫోకస్ పెట్టారని, నిర్మాతగా రాణించాలని నిర్ణయించుకున్నారుని అంటున్నారు. 

 

click me!

Recommended Stories