ఈ లెక్కన మూవీ మహాభారతంలోని కృష్ణుడి అవతారం నుంచి విష్ణు అవతారం, అలాగే కల్కి అవతారం వరకు చూపిస్తూ, దాన్ని భవిష్యత్ 2898ఏడీ కాలం వరకు తీసుకెళ్లబోతున్నారు. ఈ మధ్య పరిణామాలను, భవిష్యత్ కాలాన్ని ఈ మూవీలో ఆవిష్కరించబోతున్నారు నాగ్ అశ్విన్. అందుకే ఇందులో ప్రభాస్.. కృష్ణుడిగా, విష్ణువుగా, కల్కిగా కనిపిస్తారని అంటున్నారు. అయితే ఈ మూడు అంశాలను ఎలా బ్లెండ్ చేయబోతున్నాడు, ఎలా చూపించబోతున్నాడు, మన ఆడియెన్స్ కి అర్థమయ్యేలా ఎలా చెప్పబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే క్యూరియాసిటీని పెంచుతుంది.