ఇండియాలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రాల్లో కల్కి 2 ఒకటి. గత ఏడాది నాగ్ అశ్విన్ దర్శకుడిగా ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఎడి చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లు రాబట్టింది. దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.