అనిరుథ్‌, థమన్‌, డీఎస్పీ, రెహ్మాన్‌.. స్టార్‌ హీరోలను మించిన మ్యూజిక్‌ డైరెక్టర్ల పారితోషికం.. ఎంతంటే?

Published : Feb 25, 2025, 10:19 AM IST

స్టార్‌ హీరోల మాదిరిగానే మ్యూజిక్‌ డైరెక్టర్స్ కూడా పారితోషికం పెంచుతూ షాకిస్తున్నారు. అనిరుథ్‌, రెహ్మాన్‌, థమన్‌, దేవిశ్రీ ప్రసాద్‌, కీరవాణి పారితోషికాల లెక్కలు చూద్దాం.   

PREV
17
అనిరుథ్‌, థమన్‌, డీఎస్పీ, రెహ్మాన్‌.. స్టార్‌ హీరోలను మించిన మ్యూజిక్‌ డైరెక్టర్ల పారితోషికం.. ఎంతంటే?
music directors

సినిమాల్లో పారితోషికాలు ఇప్పుడు అమాంతం పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు, వరుస విజయాలతో స్టార్స్‌ ఒకేసారి కోట్లకు కోట్లు పెంచుతున్నారు. హీరోల్లో వంద కోట్లు దాటి, రెండు వందల కోట్లకు వెళ్లింది. హీరోయిన్లలో సింగిల్‌ డిజిట్స్ నుంచి డబుల్‌ డిజిట్స్ పారితోషికం తీసుకుంటున్నారు. ఒక కోటి లోపు పారితోషికం తీసుకునే మ్యూజిక్‌ డైరెక్టర్లు ఇప్పుడు అమాంతం పెంచేశారు. వాళ్ల రెమ్యూనరేషన్ కూడా హీరోల స్థాయిలో ఉండటం విశేషం. 

ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న మ్యూజిక్‌ డైరెక్టర్స్ లో అనిరుథ్‌ ముందు వరుసలో ఉన్నారు. వీరితోపాటు తమన్‌ వరుస హిట్లతో దుమ్ములేపుతున్నాడు. `పుష్ప 2`తో రచ్చచేస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్‌. అలాగే `ఛావా` మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు ఆస్కార్‌ విన్నర్‌ రెహ్మాన్‌. మరి వీరి పారితోషికాలు ఎలా ఉన్నాయి, ఎంత తీసుకుంటున్నారనేది చూస్తే. 
 

27
Anirudh Ravichander

మ్యూజిక్ డైరెక్టర్స్ లో టాప్‌లో ఉన్నది అనిరుథ్‌ రవిచందర్‌. ఆయన లేటెస్ట్ సంగీతంలో సెన్సేషన్‌గా మారారు. మాస్‌, యాక్షన్‌ సినిమాలకు, ఎలివేషన్లకి కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఆయన పారితోషికం ఒక్కో సినిమాకి 10-12కోట్లు తీసుకుంటున్నారట. 

37
రెహ్మాన్‌.

అలాగే మొన్నటి వరకు రెహ్మాన్‌ గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. ఆయన డౌన్‌ అవుతున్నారని అంతా భావించారు. కానీ `ఛావా`తో ట్రాక్‌లోకి వచ్చాడు ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహ్మాన్‌. ఆయన ఇప్పుడు ఒక్కో సినిమాకి రూ.8-10కోట్లు తీసుకుంటున్నారుట. `ఛావా` హిట్‌ తర్వాత అది పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు చిత్రానికి మ్యూజిక్‌ చేస్తున్నారు. 
 

47
devisri prasad

తెలుగులో టాప్‌లో ఉన్న మ్యూజిక్‌ డైరెక్టర్స్ డైరెక్టర్‌గా రాణిస్తున్న దేవిశ్రీప్రసాద్‌. ఆయన కూడా మొన్నటి వరకు డౌన్‌ అయ్యాడు. కానీ `పుష్ప 2`తో మళ్లీ పుంజుకున్నాడు. ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకు 8-10కోట్లు తీసుకుంటున్నాడట. 

57
thaman

ఇక మాస్‌, కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న థమన్‌ సైతం భారీగానే పారితోషికం అందుకుంటున్నారు. ఇటీవల వరుసగా బాలయ్య సినిమాలతో విజయాలు అందుకున్న ఆయన ఒక్కో మూవీకి రూ6-7కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్టు సమాచారం. 
 

67

ఎంఎం కీరవాణి చాలా సెలక్టీవ్‌గా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం మహేష్‌, రాజమౌళి మూవీకి సంగీతం అందిస్తున్నారు. అలాగే చిరంజీవి `విశ్వంభర`కి మ్యూజిక్ చేస్తున్నారు. మహేష్‌ మూవీకి రూ.12కోట్లకుపైగానే ఇస్తున్నారని, కానీ చిరంజీవి మూవీకి అందులో సగం వరకే ఉంటుందని తెలుస్తుంది. 

77
bheems

సౌత్‌లో వీరు టాప్‌లో ఉన్నారు. స్టార్‌ హీరోలకు దీటుగా పారితోషికం తీసుకుంటూ దూసుకుపోతున్నారు. ఆ తర్వాత ఇటీవల భీమ్స్ సిసిరోలియో ట్రాక్‌లోకి వచ్చాడు. `సంక్రాంతికి వస్తున్నాం`తో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌ ఇచ్చాడు. ఆయన ఇప్పుడు కోటి రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారట.

చిరంజీవి, అనిల్‌ రావిపూడి మూవీకి రెండు కోట్ల వరకు తీసుకుంటున్నాడని సమాచారం. వీరితోపాటు అజనీష లోక్‌నాథ్‌ వంటి ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్ కోటీ నుంచి రెండు కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. 

read  more: ఓ వైపు తండ్రి చనిపోయి ఉన్నాడు, మరోవైపు ఆసుపత్రిలో రైటర్‌.. అలాంటి పరిస్థితుల్లో ప్రభాస్‌ ఏం చేశాడో తెలుసా?

also read: మూడు గంటలు క్యాన్సర్‌ ఆపరేషన్‌, సాయిబాబా గుడిలో నాగార్జున.. ఏఎన్నార్‌ మాటలకు కన్నీళ్లు
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories