అర్జంటుగా నువ్వు ఒక్కడివే రా అంటూ ఫోన్ పెట్టేస్తుంది భవాని. మురారి ద్వారా విషయం తెలుసుకున్న కృష్ణ అంత అర్జెంటు ఏంటో అనుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది. మరోవైపు భవాని ఇంటికి పెళ్ళివారు వస్తారు. కుశల ప్రశ్నలు అయిన తరువాత మా అమ్మాయి గురించి మీకు ఈశ్వర్ పూర్తిగా చెప్పాడు కదా అంటుంది భవాని. తెలుసు, అన్ని తెలుసుకునే పెళ్లికి ఒప్పుకున్నాను అంటాడు పెళ్లి కొడుకు. ఎందుకు ఇంత అర్జెంటుగా ఈ పెళ్లిచూపులు అసలు ఏం జరుగుతుంది అంటూ కన్ఫ్యూజ్ అవుతుంది ముకుంద. ఇంతలోనే మురారి కూడా వస్తాడు. అక్కడ జరుగుతున్న పెళ్లిచూపుల్ని,ముకుందని అందర్నీ కన్ఫ్యూజ్డ్ గా చూస్తాడు మురారి.