దాసరి నారాయణ రావు దర్శకత్వంలో భారతంలో ఒక అమ్మాయి అనే చిత్రంలో మురళి మోహన్, చంద్ర మోహన్ హీరోలుగా నటించారు. ఈ చిత్రంలో మురళి మోహన్ తల్లి దండ్రులుగా సావిత్రి, కాంతారావు నటించారు. మురళి మోహన్ సావిత్రితో తొలిసారి నటించడం ఇదే. అప్పటికి సావిత్రి సత్తా ఏంటో మురళి మోహన్ కి తెలియదు. అందరూ ఆమెని మహానటి అని కీర్తిస్తుంటే విన్నాడట.