ఈ సినిమాను మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించాడు. 'దృశ్యం' తరహాలోనే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో రూపొందిన ఈ చిత్రంలో మోహన్ లాల్కు జంటగా శోభన నటించింది. చిత్ర కథనం, పరిణామాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మలయాళం మార్కెట్లో ఇప్పటికీ హౌస్ఫుల్ షోలు కొనసాగుతున్నాయి. తెలుగులోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.