28 కోట్ల బడ్జెట్, 200 కోట్లు వసూలు చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏదో తెలుసా ?

Mahesh JujjuriPublished : May 15, 2025 6:11 PM

కేవలం 28 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. 200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది ఈ సినిమా. ఇంతకీ ఏంటా మూవీ? 

15
28 కోట్ల బడ్జెట్, 200 కోట్లు వసూలు చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏదో తెలుసా ?

కేవలం 28 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. 200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది ఈ సినిమా. ఇంతకీ ఏంటా మూవీ? 
 

25
thudarum movie mohanlal

తాజాగా విడుదలైన మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం తుడరుమ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న మలయాళం తో పాటు  తెలుగు భాషల్లో విడుదలైంది. రిలీజ్ సమయంలో పెద్దగా అంచనాలు లేకపోయినా, మొదటి షో నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించగా, ఇప్పుడు 200 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
 

35

ఈ సినిమాను మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించాడు. 'దృశ్యం' తరహాలోనే సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో రూపొందిన ఈ చిత్రంలో మోహన్ లాల్‌కు జంటగా శోభన నటించింది. చిత్ర కథనం, పరిణామాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మలయాళం మార్కెట్‌లో ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోలు కొనసాగుతున్నాయి. తెలుగులోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

45

తుడరుమ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జియో హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. థియేటర్‌లో రిలీజ్ అయిన నెలరోజుల తర్వాత అంటే మే 23 లేదా మే 30 తేదీల్లో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలన్న ప్లాన్ ఉంది. అయితే ప్రస్తుతం సినిమాకు థియేటర్లలో ఇంకా బలమైన వసూళ్లు వస్తున్నందున, ఓటీటీ రిలీజ్‌లో ఆలస్యం కూడా అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

55

ఈ నేపథ్యంలో, తుడరుమ్ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటున్న వీక్షకులు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో జియో హాట్‌స్టార్ ఈ విషయంపై స్పష్టత ఇవ్వనుంది. సినిమాకు దేశవ్యాప్తంగా వస్తున్న స్పందనను చూసితే, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో కూడా ఇది మంచి హిట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.
 

Read more Photos on
click me!