మోహన్ బాబు సెటైర్లు 'పుష్ప' పైనేనా.. ఆ సన్నివేశంపై కామెంట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 18, 2022, 11:42 AM IST

సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన 'సన్నాఫ్ ఇండియా' చిత్రం నేడు గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

PREV
16
మోహన్ బాబు సెటైర్లు 'పుష్ప' పైనేనా.. ఆ సన్నివేశంపై కామెంట్స్

సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన 'సన్నాఫ్ ఇండియా' చిత్రం నేడు గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మోహన్ బాబు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టాలీవుడ్ టికెట్ ధరల వ్యవహారం ఇంకా కొనసాగుతోంది. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 

26

ఈ తరుణంలో సన్నాఫ్ ఇండియా చిత్రం రిలీజ్ అవుతుండడం ఆసక్తిగా మారింది. ఇక మంచు ఫ్యామిలీ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. వీటిపై మోహన్ బాబు తనదైన శైలిలో స్పందించారు. సన్నాఫ్ ఇండియా చిత్రం విడుదలవుతుండడంతో ప్రస్తుతం వస్తున్న సినిమాలపై మోహన్ బాబు స్పందించారు. 

 

36

ఆడియన్స్ టేస్ట్ మారింది. అలా అని పూర్తిగా బ్లేమ్ చేయను. సినిమాలపై వాళ్ళిచ్చే తీర్పు గమ్మత్తుగా ఉంటోంది. డబుల్ మీనింగ్ ఎక్కువగా కోరుకుంటున్నారు. కొన్ని సినిమాల్లో చెయ్యి అక్కడ వేశాను తీసెయ్యాలా, కాలు పైన వేశాను తీసేయమంటావా అనే సన్నివేశాలు ఎక్కువగా వస్తున్నాయి. మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు గమనిస్తే పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ పుష్ప చిత్రం గురించే అనిపిస్తుంది. పుష్ప చిత్రంలో అలాంటి సన్నివేశం ఉంది. 

 

46

సన్నాఫ్ ఇండియాలో కూడా ముద్దు సన్నివేశాలు పెట్టాం. ఆ సన్నివేశాలు పెట్టడం నాకు, విష్ణుకి ఇష్టం లేదు. కానీ కథ పరంగా పెట్టాలని దర్శకుడు చెప్పడంతో నేను కన్విన్స్ అయ్యా. ఒక బ్యాడ్ లేడి డాక్టర్ మరో అమ్మాయితో లిప్ లాక్ చేసే సీన్ అది అని మోహన్ బాబు రివీల్ చేశారు. 

 

56

ఇక ఇండస్ట్రీ గురించి మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖలు చేశారు. హీరోల రెమ్యునరేషన్ గురించి నేను మాట్లాడను. వాళ్లకు ఎంత మార్కెట్ ఉంటే అంత తీసుకుంటారు. అది వాళ్ల ఇష్టం. కానీ ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీ లాగా లేదు. కలిసి ఉండడం లేదు అని మోహన్ బాబు అన్నారు. 

 

66

ఇక మంచు విష్ణు ఏం చేసినా కాంట్రవర్సీ చేస్తున్నారు. కొందరు దుర్మార్గులే ఇలా చేస్తున్నారు. విష్ణు జగన్ ని వెళ్లి కలిశాడు. ఎందుకంటే జగన్ మాకు బంధువు. వాళ్లిద్దరూ లంచ్ మీటింగ్ లో చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నారు. వాటి గురించి ఎందుకు చెప్పరు. అనవసరమైన కాంట్రవర్సీ ఎందుకు అని మోహన్ బాబు ప్రశ్నించారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories