పూట గడవని స్థితిలో ఎస్పీ బాలు వద్ద వంద అప్పు చేశా, తీర్చలేదు.. మోహన్ బాబు

First Published Aug 24, 2020, 1:21 PM IST

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా తో ఆసుపత్రి బెడ్ పై పోరాటం చేస్తున్న వేళ ఆయన సన్నిహితుడు అయిన నటుడు మోహన్ బాబు ఆయనతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సంధర్భంగా మోహన్ బాబు ఓ అరుదైన సంఘటన తెలియజేశారు. 

నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపైగుడ్ న్యూస్ రావడం జరిగింది. బాలుగారికికరోనా టెస్టులలోనెగెటివ్ వచ్చినట్లుఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలియజేశారు. ఈ న్యూస్ కి చిత్ర పరిశ్రమ మరియు ఆయన ఫ్యాన్స్ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా బాలుకొద్దిరోజులుగా ఆస్పత్రిలో విషమ పరిస్థితిలోకరోనాతోపోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోవిలక్షణ నటుడు మోహన్ బాబు ఆయనతో గల అనుబంధాన్ని పంచుకున్నారు.
undefined
మోహన్ బాబు, బాల సుబ్రహ్మణ్యం చిన్నప్పటి నుండి మితృలు అట. ఒకరితోమరొకరుచాలా అన్యోన్యంగాఉండేవారట. మోహన్ బాబు ఆయనను బాలు అని పిలిస్తే, బాలుఆయనను శిశుపాల, భక్త అని పిలిచేవారట. అరుదుగా మోహన్ బాబు అనేవారట.
undefined
ఇక మోహన్ బాబు నటుడిగా స్థిరపడక ముందే బాలు స్టార్ సింగర్ గా సౌత్ ఇండియాలో ఫేమస్ అయ్యారు.నటుడిగాఅవకాశాల కోసం మోహన్ బాబు ప్రయత్నాలలో ఉన్నప్పుడు మోహన్ బాబు బాలు గారిదగ్గర అప్పు చేశారట. భోజనానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితులలో100 రూపాయలు అప్పుగా తీసుకున్నారట.
undefined
బాలుదగ్గర తీసుకున్న ఆ అప్పు మోహన్ బాబు ఇంత వరకుతీర్చలేదట. అది జరిగిన చాలాకాలం కాగా మోహన్ బాబు ఆ వంద రూపాయలు ఇంకా బాలుకు తిరిగి ఇవ్వలేదట. బాలుమోహన్ బాబుతో' ఏమయ్యా నా వంద రూపాయలు ఇంకా ఇవ్వలేదుగా, ఇప్పటికిఅది కోటి దాటిపోయిఉంటుంది' అని సరదాగాఅంటుంటారట.
undefined
ఇక బాలుగారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మోహన్ బాబు తన ఇష్టదైవం సాయి బాబును కోరుకున్నారు. ఆయన తప్పకుండా కోలుకొని తిరిగివస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మోహన్ బాబు నటించిన అనేక సినిమాలకు బాలు సింగర్ గా పనిచేశారు.
undefined
click me!