మిర్చి చిత్రంతో గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాధవి.. మిర్చి మాధవిగా మారారు. ప్రభాస్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు దక్కితే క్షణం కూడా తీరిక ఉండదు. ఎట్ ఎ టైం మల్టిపుల్ మూవీస్ లో అవకాశాలు వస్తాయి. ఒకే రోజు పలు చిత్రాలకు డేట్లు కేటాయించాల్సి ఉంటుంది. అలాంటి బిజీ ఆర్టిస్ట్ లలో మిర్చి మాధవి ఒకరు. తల్లి, వదిన, అత్త తరహా పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. టీవీ సీరియల్స్ లో కూడా ఆమె నటిస్తున్నారు.
25
మిర్చి చిత్రంతో గుర్తింపు
మిర్చి చిత్రంతో ఆమెకి గుర్తింపు దక్కింది కాబట్టి మిర్చి మాధవిగా మారారు. ప్రభాస్ తన అందాన్ని పొగిడిన విషయాన్ని మిర్చి మాధవి గుర్తు చేసుకున్నారు. మిర్చి చిత్రంలో నటిస్తున్నప్పుడు ప్రభాస్ నా గురించి మాట్లాడారు. ప్రభాస్ శ్రీను గతంలో ప్రభాస్ కి మేనేజర్ గా పనిచేశారు. మిర్చి షూటింగ్ జరుగుతున్నప్పుడు నా గురించి ప్రభాస్ శ్రీనుకి చెప్పారట.
35
ఆంటీ అనకపోతే అక్క అని ఎలా అంటారు
ఆ ఆంటీ ఎవరు ? కొత్తగా వచ్చారా ? ఆమె కళ్ళు చాలా బావున్నాయి అని అన్నారట. ఏంటి మిమ్మల్ని ప్రభాస్ ఆంటీ అన్నారా అని అడగగా.. నాతో ఎప్పుడూ అలా అనలేదు. కానీ వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆంటీ అన్నారట. అయినా నాకేం ఇబ్బంది లేదు. ఆంటీ అనకపోతే అక్క అని ఎలా అంటారు. హిందీలో అయితే నాకన్నా ఇంకా ఏజ్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఆంటీ అని పిలిచారు.
ఇక్కడ హీరోయిన్ కాకపోతే మిగిలిన ఎవరైనా ఆంటీనే అని మిర్చి మాధవి అన్నారు. మిమ్మల్ని ఇండస్ట్రీలో ఎవరైనా వేధించారా, హర్ట్ చేశారా అని ప్రశ్నించగా మిర్చి మాధవి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నన్ను ఒకరు ఇబ్బంది పెట్టేంత పరిస్థితి నేను తెచ్చుకోను. ఒక వేల ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని బతకనివ్వను. బతకనివ్వను అంటే అంతలా వాళ్లకు బుద్ధిచెబుతా అని అర్ధం అంటూ మిర్చి మాధవి కామెంట్స్ చేశారు.
55
నా భర్త జాబ్ పోయింది
ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న టైంలో నా భర్తకి యుకె లో జాబ్ వచ్చింది. నెలకు 18 లక్షల జీతం. కానీ ఆ జాబ్ పోయింది. దీనితో తాను తిరిగి ఇండస్ట్రీకి వచ్చాను అని మిర్చి మాధవి అన్నారు.